
Siddham Meeting : ప్రకాశం జిల్లాలో ' సిద్ధం ' చివరి సభ.. వైయస్ జగన్ ఇచ్చే హామీలపై సర్వత్రా ఆసక్తి..!
Siddham Meeting : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొత్త పథకాలపై ఆంధ్రప్రదేశ్ లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం వైయస్ జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏంటి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తారు. సిద్ధం సభ వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించిన వైయస్ జగన్ ఈరోజు మార్చి 10 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు.
సిద్ధం సభకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సభ ప్రారంభం కాకముందే వైసీపీ కార్యకర్తలు అంతా వేలల్లో సభకు చేరుకున్నారు. ఆరు జిల్లాలు 43 నియోజకవర్గ సెగ్మెంట్లే టార్గెట్ గా వైసీపీ సిద్ధం చివరి సభ జరగనుంది. ఈ సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో భాగంగా ఎలాంటి కొత్త హామీలు ప్రవేశపెడతారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై వైయస్ జగన్ కౌంటర్ ఎలా ఉండబోతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం చివరి సభ లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది వైసీపీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే టీడీపీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్ళింది. ఈ క్రమంలోనే వైసీపీ టీడీపీని మించి పథకాలను ప్రకటిస్తుందని టీడీపీ ఎన్నికలు మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైసీపీ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టోలో సామాజిక పెన్షన్ పెంపుకు సంబంధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ పెన్షన్లను ఐదువేల వరకు పెంచుకుంటూ వెళ్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటి అంశాలపై కూడా ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే హామీలను నేరవేరుస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
This website uses cookies.