Operation Sindoor : ఉగ్రమూకల దాడికి సిందూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా?
ప్రధానాంశాలు:
Operation Sindoor : ఉగ్రమూకల దాడికి సిందూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా?
Operation Sindoor : పాక్లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ‘ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. పాకిస్థాన్, పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు దాడులు చేశాయి. 9 పాక్ ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తొయిబా ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేశాయి.

Operation Sindoor : ఉగ్రమూకల దాడికి సిందూర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా?
Operation Sindoor సిందూర్ పేరు వెనక అర్ధం
“ఆపరేషన్ సింధూర్” పేరుతో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పహల్గామ్ దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు పాక్, పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే, ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించేందుకు భారత్”ఆపరేషన్ సింధూర్” అనే పేరు ఎందుకు పెట్టింది? అనేది మీకు తెలుసా?
ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గామ్ ఉగ్రదాడి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్తాన్పై దాడి చేసినట్లు తెలుస్తోంది. పాక్పై భారత్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు.