Sri Reddy : పిచ్చి కుక్కలు వెంట పడతాయి అంటూ పవన్ కళ్యాణ్ పై శ్రీ రెడ్డి సీరియస్ కామెంట్స్..!!
Sri Reddy : నటి శ్రీరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ నెలలో పవన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం తెలిసిందే. ఆ సమయంలో మిత్రపక్షం బీజేపీ పార్టీ పెద్దలతో కలవడం జరిగింది. పవన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ పర్యటనపై తాజాగా శ్రీరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ పెట్టి సెటైర్లు వేసింది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్పుకొచ్చింది.
Sri Reddy Comments On Pawan Kalyan
తనకు అన్ని పార్టీలో మనుషులు ఉన్నారని..పవన్ పై చంద్రబాబు మండిపడినట్లు తెలిపింది. పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు వాతల మీద వాతలు పెడుతున్నారని.. శ్రీ రెడ్డి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన తన పరువు తీసుకునేలా చేసుకున్నాడని పేర్కొంది. పిల్ల సైనిక్స్ మధ్య కూడా పరువు పోయింది. ఆఖరికి వారాహి తుప్పుపట్టే పరిస్థితి వెళ్ళిపోయింది. దీంతో ఆ వాహనం వెనకాల పిచ్చి కుక్కలు వెంట పడతాయి అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
Sri Reddy Comments On Pawan Kalyan
ఆ వారాహి వాహనంపై నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ టీలు టిఫిన్లు అమ్ముకోవాలి.. దానికి తప్ప ఇంక దేనికి అది పనికిరాదు అని శ్రీరెడ్డి సెటైర్లు వేసింది. వారాహి వాహనం పట్టుకెళ్ళి విజయవాడ సెంటర్ లో టీ స్టాల్ పెట్టుకోండి అని శ్రీరెడ్డి కామెడీ చేసింది. ఇంకా అనేక రకాలుగా పార్టీలకు సంబంధించి పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి వ్యంగ్యంగా ఈ లైవ్ లో విమర్శలు చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
