kashmir : కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. కనిపెట్టిన నిఘా కెమెరాలు..!
ప్రధానాంశాలు:
kashmir : కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. కనిపెట్టిన నిఘా కెమెరాలు..!
kashmir : జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లష్కర్ ఎ తోయిబా అనుబంధ సంస్థ “ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)” ఈ దాడికి బాధ్యత వహించగా, ఇందులో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారు. ఈ దాడిలో మృతుల్లో 25 మంది భారతీయులు కాగా, ఒకరు నేపాల్కు చెందిన వ్యక్తి. అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం, అమాయకుల ప్రాణాలు తీసుకోవడం దేశ ప్రజలను కలచివేసింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రకటించింది.

kashmir : కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. కనిపెట్టిన నిఘా కెమెరాలు..!
kashmir : కొండల్లో దాక్కున్న ఉగ్రవాదులు.. మన కెమెరాలు ఆగుతాయా..!
దాడి తర్వాత భారత సైన్యం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కలిసి భారీ స్థాయిలో శోధన ఆపరేషన్ను ప్రారంభించాయి. పహల్గాం, పూంఛ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లు సహాయంతో ప్రతి అడుగును జల్లెడ పడుతున్నారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన నెట్రా డ్రోన్లు, ఇజ్రాయెల్కి చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలు, ఇస్రో ఉపగ్రహాల సహకారం ద్వారా ఉగ్రవాదుల తలాస్థానాలను గుర్తించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో సైన్యం శత్రువులపై దూకుడు చూపిస్తోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైన్యానికి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో పాటు భద్రతా రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టింది. సరిహద్దుల్లో స్మార్ట్ ఫెన్సింగ్, అధునాతన సెన్సార్లు మోహరించడం, స్థానిక ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గాం ఘటన దేశ భద్రత పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపబోదని, ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఇవ్వబోమన్న సంకేతాలను ఇవ్వడంలో కీలకంగా మారింది.