
Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రైల్వే బోర్డు నుండి లభించిన సమాచారం ప్రకారం, జూలై 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు (నాన్-ఏసీ)లో ప్రయాణించేవారికి కిలోమీటరుకు ఒక పైసా పెరగనుండగా, ఏసీ తరగతిలో రెండు పైసాలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 20 వరకు అదనపు భారం పడనుంది.
Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
అలాగే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 500 కిలోమీటర్ల వరకు ఛార్జీలు పెరగవు. కానీ 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తే అరపైసా చొప్పున అదనంగా చెల్లించాలి. ఉదాహరణకు, 1000 కి.మీ ప్రయాణానికి రూ. 2.50 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ (లోకల్) రైళ్లలో ప్రయాణించే వారిపై ఈ ఛార్జీల పెంపు ప్రభావం ఉండదు. ఇది చిన్న పెరుగుదలగా కనిపించినా, తరచూ ప్రయాణించే వారిపై దీని ప్రభావం ఉండే అవకాశముంది.
ఇక తత్కాల్ టికెట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు కూడా రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియజేసింది. IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేవారికి ఇది అమలులో ఉంటుంది. అలాగే జూలై 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్యల వల్ల టికెట్లు న్యాయంగా అందించబడతాయని, మధ్యవర్తుల మోసాలను నివారించవచ్చని రైల్వే శాఖ చెబుతోంది.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
This website uses cookies.