Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రైల్వే బోర్డు నుండి లభించిన సమాచారం ప్రకారం, జూలై 1, 2025 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లు (నాన్-ఏసీ)లో ప్రయాణించేవారికి కిలోమీటరుకు ఒక పైసా పెరగనుండగా, ఏసీ తరగతిలో రెండు పైసాలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 20 వరకు అదనపు భారం పడనుంది.
Train : రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన న్యూస్..!
అలాగే సెకండ్ క్లాస్ ప్రయాణికులకు 500 కిలోమీటర్ల వరకు ఛార్జీలు పెరగవు. కానీ 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణిస్తే అరపైసా చొప్పున అదనంగా చెల్లించాలి. ఉదాహరణకు, 1000 కి.మీ ప్రయాణానికి రూ. 2.50 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సబర్బన్ (లోకల్) రైళ్లలో ప్రయాణించే వారిపై ఈ ఛార్జీల పెంపు ప్రభావం ఉండదు. ఇది చిన్న పెరుగుదలగా కనిపించినా, తరచూ ప్రయాణించే వారిపై దీని ప్రభావం ఉండే అవకాశముంది.
ఇక తత్కాల్ టికెట్లకు సంబంధించిన కొత్త నిబంధనలు కూడా రైల్వే శాఖ ప్రకటించింది. జూలై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియజేసింది. IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేవారికి ఇది అమలులో ఉంటుంది. అలాగే జూలై 15 నుంచి తత్కాల్ బుకింగ్ సమయంలో ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ చర్యల వల్ల టికెట్లు న్యాయంగా అందించబడతాయని, మధ్యవర్తుల మోసాలను నివారించవచ్చని రైల్వే శాఖ చెబుతోంది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…
This website uses cookies.