Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..!

Funds To AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులను విడుదల చేసింది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులలో గ్రామపంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం విడుదలైన నిధులు ఆయా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జనాభా ప్రాతిపదికన జమ కానున్నాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం ఈ నిధులు కేటాయింపు జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల వాడకంపై విమర్శలు వచ్చినప్పటికీ, ఇప్పుడు నిధులు నేరుగా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించేందుకు కట్టుబడి ఉన్నారు.

Funds To AP ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం

Funds To AP : ఏపీకి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసిన కేంద్రం..!

Funds To AP ఏపీకి నిధుల ప్రవాహం కురిపించిన మోడీ

ఆర్థిక సంఘం విడుదల చేసే గ్రాంట్లు రెండు రకాలుగా ఉంటాయి. టైడ్ మరియు అన్ టైడ్. అన్ టైడ్ గ్రాంట్లు స్థానిక సంస్థలు జీతాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చు. టైడ్ గ్రాంట్లు పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, ఓడిఎఫ్ కార్యకలాపాలు, వర్షపు నీటి పునః వినియోగం వంటి ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే తొలి విడత నిధులు విడుదల కాగా, ప్రస్తుతం విడుదలైనవి రెండో విడత నిధులు కావడం విశేషం.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత వెంటనే నిధుల విడుదల జరగడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రధాని మోదీతో కలిసి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి, అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ఆహ్వానం కూడా ఇచ్చారు. పలు పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలు జరిపిన తరువాత వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం చంద్రబాబు పర్యటన ఫలితంగా భావించబడుతోంది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి పనులు వేగవంతం కావడం ఖాయం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది