today telugu breaking news 25-11-2023
Today Telugu Breaking News : మీ భూమి ఎవరికైనా కౌలుకు ఇస్తే.. అప్పుడు ఆ భూమి యజమానికి రైతుబంధు ఇవ్వం. ఆ భూమిని కౌలు చేసే రైతులకే రైతు బంధు(Rythu Bandhu) ఇస్తాం. అసలు భూయజమాని కౌలుకు ఇస్తే రైతు బంధు ఇవ్వం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్(Charan Koushik Yadav) స్పష్టం చేశారు.
నిజామాబాద్, బోధన్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi Bodhan Tour) బోధన్ రాకను నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. బలిదానాల బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని.. తమ బిడ్డలను చంపింది కాంగ్రెస్ పార్టీ అని పోస్టర్లలో రాసి ఉంది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాల్సిందే. ముక్కు నేలకు రాయాల్సిందేనని డిమాండ్ చేశారు. పోస్టర్లలో కర్ణాటకలో కరెంట్ కష్టాలు, నిరుద్యోగాన్ని ఎండగట్టారు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి(MLA Pilot Rohit Reddy) ఇంట్లో ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి. తాండూరులోని ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి రోహిత్ ఇంట్లో 20 లక్షల నగదు, పలు రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బీఆర్ఎస్(BRS) ను గెలిపిస్తే ప్రజల సొమ్మును వాళ్లు లూటీ చేస్తారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) అన్నారు. తెలంగాణలో భూముల వేలంలో 4 వలే కోట్ల అవినీతి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో, ఔటర్ రింగ్ రోడ్ లీజు వేలంలోనూ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన రోడ్ షోలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాల్గొన్నారు. అవినీతి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆమె కొనియాడారు.
జగన్(YS Jagan) కు మళ్లీ 6093 ఖైదీ డ్రెస్ వేసుకునే సమయం వచ్చిందని.. ఇంకెంత కాలం దొంగ సొమ్ముతో మేనేజ్ చేస్తారని టీడీపీ నేత నారా లోకేష్(Nara Lokesh) ప్రశ్నించారు. కోర్టు నోటీసులు వచ్చాయి.. ఇక జగన్ అండ్ కో పని అయిపోయింది అంటూ విమర్శించారు.
ఎన్నికలకు మూడు రోజుల ముందు రైతుబంధు సాయం పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న ఒప్పందం మరోసారి బయటపడిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.
మాజీ ప్రధాని పీవీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. ఆయన్ను తీవ్రంగా అవమానించిందని మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi)కి అసలు ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు.
ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు(Gujarat Titans) కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆ జట్టు నుంచి వైదొలిగి ముంబై ఇండియన్స్(Mumbai Indians) గూటికి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ టీమ్ కు కెప్టెన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత 15 కోట్లకు హార్ధిక్ ను తీసుకొని ముంబైకి కెప్టెన్ ను చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి నడకదారి(Tirumala temple steps)లో నడుస్తూ వెళ్తున్న ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్(AP Intelligence DSP Krupakar) గుండెపోటుతో మృతిచెందారు. ఈనెల 26, 27న ప్రధాని మోదీ(PM Modi Tirumala Tour) తిరుమల పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల్లో ఉన్న ఆయన మెట్ల మార్గాన్ని పరిశీలిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.