
ys jaganmohan reddy
YS jagan : ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోని ఐదుగురు రైతుల్లో ఒక్కరుకూడా రాజధానికి సెంటు భూమి ఇవ్వలేదు.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తనపై ఉన్నకేసుల విచారణ పూర్తైతే తానెటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో జగన్ ఉన్నాడు. అందుకే చంద్రబాబుని ఏదోరకంగా జైలుకుపంపి, ఆయనకూడా తప్పుచేశాడని ప్రజలతో అనిపించడానికి నానాపాట్లు పడుతున్నాడు అంటూ వర్ల రామయ్య విమర్శించాడు.
అందులో భాగంగానే చంద్రబాబు చేసిన తప్పులను వెతికిపట్టుకున్నవారికి అవార్డులు ఇస్తానని అధికారులకు ఆశచూపాడు. ఆ క్రమంలోనే ఆళ్లరామకృష్ణారెడ్డిఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని వెనకాముందూ ఆలోచించకుండా సీఐడీ చంద్రబాబుకి నోటీసులిచ్చిందని, ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు రైతులు ఎవరూకూడా రాజధానికి వారిభూములివ్వలేదు. వారిలో ఒకడైన జూపూడిజాన్సన్ వైసీపీవిద్యార్థి విభాగం నాయకుడు, అతనిపై కిడ్నాప్ కేసు కూడా ఉందని రామయ్య అన్నాడు.
రాజధానిపరిధిలో లేనివారు, రాజధానికి సెంటుభూమి ఇవ్వనివారు ఫిర్యాదుచేశారని రామకృష్ణారెడ్డిచెబితే, ఏమాత్రం విచారణ జరపకుండా సీఐడీ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటి? రైతులను మోసగించి, వారితో తప్పుడు సంతకాలు పెట్టించుకున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఛీటింగ్ ఫోర్జరీ కేసులుపెట్టి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తక్షణమే విచారణ జరిపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశాడు.
చంద్రబాబు స్టేలు ఎందుకు తెచ్చుకుంటాడంటున్న బుద్ధిలేని మంత్రి, జగన్మోహన్ రెడ్డి సీబీఐ, ఈడీకేసుల్లో బెయిల్ కోసం కోర్టులచుట్టూ ఎందుకు తిరిగాడో సమాధానం చెప్పాలి. తనపై ఉన్నకేసులవిచారణ పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకుజైల్లోనే ఉండలేదే పనికిమాలిన మంత్రి చెప్పగలడా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగంచేస్తున్న వైసీపీని, ప్రభుత్వాన్ని అదే యాక్ట్ కాలనాగై కాటేస్తుంది.డీజీపీకి బెస్ట్ డీజీపీ అవార్డు రావడం, అనేక అవినీతికేసులున్న జగన్ ముఖ్యమంత్రి కావడంలాంటిదే అంటూ రామయ్య చెణుకులు విసిరాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లుదండుకొని, చట్టానికి చిక్కి సీబీఐతో అరెస్ట్ కాబడి, చంచల్ గూడా జైల్లో 16నెలలు రిమాండ్ ఖైదీగాఉన్నవిషయం 11కేసుల్లో సీబీఐ, 5కేసుల్లో ఈడీ ఆయనపై ఛార్జ్ షీట్లు వేసిన విషయం అందరికీ తెలిసిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు.
Holi : తెలంగాణ పల్లెల్లో ప్రతి హోలీ పూర్ణమి పండుగ ముంగిట ప్రత్యేకమైన జానపద పండుగ కాముడ ఆట సందడి…
ENG vs PAK T20 World Cup 2026 శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026…
Indiramma Houses : ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను…
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ…
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
This website uses cookies.