YS jagan : జగన్ కుడితిలో పడ్డ ఎలుక.. అది ఒక బెజవాడ బ్లెడ్ బ్యాచ్ ..

YS jagan : ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదులోని ఐదుగురు రైతుల్లో ఒక్కరుకూడా రాజధానికి సెంటు భూమి ఇవ్వలేదు.జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తనపై ఉన్నకేసుల విచారణ పూర్తైతే తానెటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయంతో జగన్ ఉన్నాడు. అందుకే చంద్రబాబుని ఏదోరకంగా జైలుకుపంపి, ఆయనకూడా తప్పుచేశాడని ప్రజలతో అనిపించడానికి నానాపాట్లు పడుతున్నాడు అంటూ వర్ల రామయ్య విమర్శించాడు.

అందులో భాగంగానే చంద్రబాబు చేసిన తప్పులను వెతికిపట్టుకున్నవారికి అవార్డులు ఇస్తానని అధికారులకు ఆశచూపాడు. ఆ క్రమంలోనే ఆళ్లరామకృష్ణారెడ్డిఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని వెనకాముందూ ఆలోచించకుండా సీఐడీ చంద్రబాబుకి నోటీసులిచ్చిందని, ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్న ఐదుగురు రైతులు ఎవరూకూడా రాజధానికి వారిభూములివ్వలేదు. వారిలో ఒకడైన జూపూడిజాన్సన్ వైసీపీవిద్యార్థి విభాగం నాయకుడు, అతనిపై కిడ్నాప్ కేసు కూడా ఉందని రామయ్య అన్నాడు.

రాజధానిపరిధిలో లేనివారు, రాజధానికి సెంటుభూమి ఇవ్వనివారు ఫిర్యాదుచేశారని రామకృష్ణారెడ్డిచెబితే, ఏమాత్రం విచారణ జరపకుండా సీఐడీ మాజీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటి? రైతులను మోసగించి, వారితో తప్పుడు సంతకాలు పెట్టించుకున్నందుకు రామకృష్ణారెడ్డిపై ఛీటింగ్ ఫోర్జరీ కేసులుపెట్టి, వెంటనే అరెస్ట్ చేయాలి. ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తక్షణమే విచారణ జరిపించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశాడు.

చంద్రబాబు స్టేలు ఎందుకు తెచ్చుకుంటాడంటున్న బుద్ధిలేని మంత్రి, జగన్మోహన్ రెడ్డి సీబీఐ, ఈడీకేసుల్లో బెయిల్ కోసం కోర్టులచుట్టూ ఎందుకు తిరిగాడో సమాధానం చెప్పాలి. తనపై ఉన్నకేసులవిచారణ పూర్తయ్యే వరకు జగన్మోహన్ రెడ్డి ఎందుకుజైల్లోనే ఉండలేదే పనికిమాలిన మంత్రి చెప్పగలడా? ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగంచేస్తున్న వైసీపీని, ప్రభుత్వాన్ని అదే యాక్ట్ కాలనాగై కాటేస్తుంది.డీజీపీకి బెస్ట్ డీజీపీ అవార్డు రావడం, అనేక అవినీతికేసులున్న జగన్ ముఖ్యమంత్రి కావడంలాంటిదే అంటూ రామయ్య చెణుకులు విసిరాడు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లుదండుకొని, చట్టానికి చిక్కి సీబీఐతో అరెస్ట్ కాబడి, చంచల్ గూడా జైల్లో 16నెలలు రిమాండ్ ఖైదీగాఉన్నవిషయం 11కేసుల్లో సీబీఐ, 5కేసుల్లో ఈడీ ఆయనపై ఛార్జ్ షీట్లు వేసిన విషయం అందరికీ తెలిసిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య తెలిపారు.

Recent Posts

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

2 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

4 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

6 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

8 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

9 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

10 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

11 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

12 hours ago