
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు...!
Ysrcp : నాయకుడు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధిగా గెలవాలంటే ముందు ప్రజలకు దగ్గరగా ఉండాలి. వారికి అందుబాటులో ఉంటాం అనే భరోసాన్ని కల్పించాలి. సమస్యలు తెలుసుకుని పరిష్కరించగలగాలి.ఇన్ని చేసినా గెలుస్తారు అనే గ్యారెంటీ మాత్రం ఉండదు. చివరిలో ఎక్కడ తేడా కొట్టిన అది ఉల్టా అవుతుంది.మరి వైసీపీ అధిష్టానం ఏ దృష్టితో ఆలోచించిందో తెలియదు కానీ పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్టులుగా ఉండే ఇద్దరు మహిళలకు టికెట్ ఇచ్చింది. ఫలితంగా ఓటమిపాలైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు బాధపడుతున్నారట. అయితే హిందూపురం అసెంబ్లీ హిందూపురం పార్లమెంటరీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తేడా జరిగిందని ఇప్పుడు అంటున్నాయి స్థానిక వైసీపీ శ్రేణులు. అసెంబ్లీ స్టేట్ మెంట్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ వంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టాలి అంటే అంతకన్నా బలమైన వారు ఉండాలి కానీ వైసీపీ పార్టీ కురబ దీపిక ను నియోజక వర్గానికి ఇంచార్జ్ గా నియమించింది. కాస్టిక్ పేరుతో వైసీపీ చేసిన ఈ ప్రయోగం అట్టర్ ప్లాప్ అయింది. బాలకృష్ణ క్రేజ్ ముందు ఎవరు నిలవలేకపోయారు కూరబ దీపిక. మరోవైపు బాలయ్య హవ మరోవైపు టీడీపీ వేవ్ కలిసి రావడం తో దీపిక ఓటమి తప్పలేదు.
అయితే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఓటమికి రకరకాల కారణాలు కనపడుతున్నాయట. అయితే ఇక్కడ కురబ దీపిక హిందూపుర ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడికి భార్య… కానీ ఆమె ఉండేది మాత్రం బెంగళూరులో. వైసీపీ నుండి టికెట్ రావడంతో హిందూపురానికి మకం మార్చారు. దాదాపు 7 – 8 నెలల పాటు ఆమె ఇక్కడ కష్టపడ్డారు. జనంలోకి బాగా వెళ్లాలి అని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అడపాదడపా తలుక్కుమని మెరిసి వెళ్లడం తప్ప ఓడిన ఇక్కడే ఉంటారు మీకోసం పనిచేస్తారు అని ప్రజలకే కాదు కనీసం పార్టీ కేడర్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదట. ఇక ఎంపీ అభ్యర్థిని విషయానికి వస్తే బళ్లారి ప్రాంతానికి చెందిన శాంతమ్మను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీటు పరిధిలో గోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఈ రకంగా కలిసి వస్తుందని లెక్కలు కట్టింది వైసీపీ అధిష్టానం. వాస్తవానికి శాంతమ్మ ది గుంతకల్లు ప్రాంతం కానీ చాలా ఏళ్ల క్రితం బళ్లారి ఏరియాలో స్థిరపడ్డారు. ఆమెకు గతంలో ఎంపీగా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఎక్కడో కర్ణాటక రాజకీయాల్లో ఉన్న శాంతమ్మను అనూహ్యంగా ఎన్నికల ముందు తీసుకువచ్చారు జగన్. ఎంతోమంది నేతలు ఉన్న వారిని కాదని పక్క రాష్ట్రం నుంచి శాంతమ్మ ను తీసుకువచ్చి నిలబెట్టారు.
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు…!
ఆ ప్రభావం ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. టీడీపీ అభ్యర్థి పార్ధ సారథి భారీ విజయం సాధించారు. పార్దసారధి అన్ని సెగ్మెంట్ లలో పరిచయాలు ఉండడం , ఇక్కడ సీనియర్ నాయకుడు కావడం , అలాగే స్థానిక సమస్యలపై అవగాహన ఉండడం అన్నీ కలిసి వచ్చాయట. శాంతమ్మ విషయానికి వస్తే వీటిలో ఏ ఒక్క క్వాలిటీ లేదు. అందుకే ఓడిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. ఓటమి తర్వాత ఆమె కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించడం లేదు. తిరిగి బళ్లారి వెళ్ళిపోయారు.గెలిచినా ఓడిన జనంలో ఉండే వారికి ఆదరణ దక్కడం చాలా కష్టం. కానీ ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ లేదా ఇతర వ్యూహాలు అంటూ వైసీపీ చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఈ గెస్ట్ ఆర్టిస్టులు కేవలం గెస్ట్ గానే మిగిలిపోతారా లేదా కొన్నాళ్ల తర్వాత అన్నా జనంలోకి వస్తారా అనేది వేచి చూడాలి.
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
This website uses cookies.