
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు...!
Ysrcp : నాయకుడు ఎవరైనా సరే ప్రజా ప్రతినిధిగా గెలవాలంటే ముందు ప్రజలకు దగ్గరగా ఉండాలి. వారికి అందుబాటులో ఉంటాం అనే భరోసాన్ని కల్పించాలి. సమస్యలు తెలుసుకుని పరిష్కరించగలగాలి.ఇన్ని చేసినా గెలుస్తారు అనే గ్యారెంటీ మాత్రం ఉండదు. చివరిలో ఎక్కడ తేడా కొట్టిన అది ఉల్టా అవుతుంది.మరి వైసీపీ అధిష్టానం ఏ దృష్టితో ఆలోచించిందో తెలియదు కానీ పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్టులుగా ఉండే ఇద్దరు మహిళలకు టికెట్ ఇచ్చింది. ఫలితంగా ఓటమిపాలైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు బాధపడుతున్నారట. అయితే హిందూపురం అసెంబ్లీ హిందూపురం పార్లమెంటరీ సీట్లకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తేడా జరిగిందని ఇప్పుడు అంటున్నాయి స్థానిక వైసీపీ శ్రేణులు. అసెంబ్లీ స్టేట్ మెంట్ లో ఎమ్మెల్యే బాలకృష్ణ వంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టాలి అంటే అంతకన్నా బలమైన వారు ఉండాలి కానీ వైసీపీ పార్టీ కురబ దీపిక ను నియోజక వర్గానికి ఇంచార్జ్ గా నియమించింది. కాస్టిక్ పేరుతో వైసీపీ చేసిన ఈ ప్రయోగం అట్టర్ ప్లాప్ అయింది. బాలకృష్ణ క్రేజ్ ముందు ఎవరు నిలవలేకపోయారు కూరబ దీపిక. మరోవైపు బాలయ్య హవ మరోవైపు టీడీపీ వేవ్ కలిసి రావడం తో దీపిక ఓటమి తప్పలేదు.
అయితే అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ ఓటమికి రకరకాల కారణాలు కనపడుతున్నాయట. అయితే ఇక్కడ కురబ దీపిక హిందూపుర ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడికి భార్య… కానీ ఆమె ఉండేది మాత్రం బెంగళూరులో. వైసీపీ నుండి టికెట్ రావడంతో హిందూపురానికి మకం మార్చారు. దాదాపు 7 – 8 నెలల పాటు ఆమె ఇక్కడ కష్టపడ్డారు. జనంలోకి బాగా వెళ్లాలి అని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. ఏదైనా కార్యక్రమాలు ఉంటే అడపాదడపా తలుక్కుమని మెరిసి వెళ్లడం తప్ప ఓడిన ఇక్కడే ఉంటారు మీకోసం పనిచేస్తారు అని ప్రజలకే కాదు కనీసం పార్టీ కేడర్ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదట. ఇక ఎంపీ అభ్యర్థిని విషయానికి వస్తే బళ్లారి ప్రాంతానికి చెందిన శాంతమ్మను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీటు పరిధిలో గోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఈ రకంగా కలిసి వస్తుందని లెక్కలు కట్టింది వైసీపీ అధిష్టానం. వాస్తవానికి శాంతమ్మ ది గుంతకల్లు ప్రాంతం కానీ చాలా ఏళ్ల క్రితం బళ్లారి ఏరియాలో స్థిరపడ్డారు. ఆమెకు గతంలో ఎంపీగా చేసిన అనుభవం కూడా ఉంది. అయితే ఎక్కడో కర్ణాటక రాజకీయాల్లో ఉన్న శాంతమ్మను అనూహ్యంగా ఎన్నికల ముందు తీసుకువచ్చారు జగన్. ఎంతోమంది నేతలు ఉన్న వారిని కాదని పక్క రాష్ట్రం నుంచి శాంతమ్మ ను తీసుకువచ్చి నిలబెట్టారు.
Ysrcp : అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. హిందూపురం వైసీపీ అభ్యర్థులపై చర్చలు…!
ఆ ప్రభావం ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది. టీడీపీ అభ్యర్థి పార్ధ సారథి భారీ విజయం సాధించారు. పార్దసారధి అన్ని సెగ్మెంట్ లలో పరిచయాలు ఉండడం , ఇక్కడ సీనియర్ నాయకుడు కావడం , అలాగే స్థానిక సమస్యలపై అవగాహన ఉండడం అన్నీ కలిసి వచ్చాయట. శాంతమ్మ విషయానికి వస్తే వీటిలో ఏ ఒక్క క్వాలిటీ లేదు. అందుకే ఓడిపోయారు అనే ప్రచారం జరుగుతుంది. ఓటమి తర్వాత ఆమె కూడా హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించడం లేదు. తిరిగి బళ్లారి వెళ్ళిపోయారు.గెలిచినా ఓడిన జనంలో ఉండే వారికి ఆదరణ దక్కడం చాలా కష్టం. కానీ ఏదో క్యాస్ట్ ఈక్వేషన్స్ లేదా ఇతర వ్యూహాలు అంటూ వైసీపీ చేసిన ప్రయోగాలు విఫలం అయ్యాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి ఈ గెస్ట్ ఆర్టిస్టులు కేవలం గెస్ట్ గానే మిగిలిపోతారా లేదా కొన్నాళ్ల తర్వాత అన్నా జనంలోకి వస్తారా అనేది వేచి చూడాలి.
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
Gold Silver Rate Today 27 Feb 2026 : పసిడి ప్రేమికులకు ఇది నిజంగా అదిరే శుభవార్త అని…
Uttutta Herolu Movie Review and Rating : తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్లు హీరోలుగా మారి సక్సెస్ సాధించడం…
Karthika Deepam 2 Today 27 Feb 2026 : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Dosha : ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపే వారు తరచూ ఒకే రకమైన అల్పాహారం తీసుకుంటూ విసుగు చెందుతుంటారు. ముఖ్యంగా…
This website uses cookies.