Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు
Kashmir Pahalgam : జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ లోయలో kashmir pahalgam జరిగిన ఉగ్రదాడి terror attack దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పర్యాటకులతో నిండిన బైసరన్ లోయ వద్ద టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించడంతో ఒక్కసారిగా హడావిడి ఏర్పడింది. మహిళలు, పిల్లలను వదిలిపెట్టి ప్రత్యేకంగా పురుషులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి కారణంగా జమ్మూకశ్మీర్లో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది.
Kashmir Pahalgam : చంపొద్దని వేడుకున్నా.. విశాఖవాసిని వదలని ఉగ్రవాది..వెంటాడి మరీ కాల్చేశారు
ఈ దారుణ దాడిలో విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. అతను ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నా ఉగ్రవాదులు వెంటాడి మరీ కాల్చినట్లు తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్నా వినకుండా చంద్రమౌళిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహా పర్యాటకులు గుర్తించగా, కుటుంబసభ్యులు వెంటనే విశాఖపట్నం నుంచి పహల్గాంకు బయల్దేరారు. ఆయన మృతదేహాన్ని మధ్యాహ్నం 12 గంటలకు విశాఖకు విమానంలో తీసుకురానున్నారు.
ఇక మరోవైపు హైదరాబాద్కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్ రంజన్ ఈ దాడిలో మరణించిన మరో బాధితుడు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ఆయన కుటుంబంతో కలిసి పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ దాడికి గురయ్యారు. ఐడీ కార్డు చూసి ఆయనను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని కాల్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను మధ్యలోనే విరమించి భారత్కు చేరుకున్నారు. పహల్గామ్ దాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. NIA ఇతడిని అత్యంత ప్రమాదకర ఉగ్రవాదిగా పేర్కొంది.
Today Gold Rate : బంగారం Gold Price కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి.…
Gautam Gambhir : భారత క్రికెట జట్టు Indian Head Coach హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కి భయానక ఉగ్రవాద…
Astrology : మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు వాటికవే పరిష్కారం దొరుకుతుంటాయని పండితులు చెబుతుంటారు. ఒకటి డబ్బు లేకపోవడం, మరొకటి…
Cardamom Milk : రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆరోగ్యమని మనందరికీ తెలుసు. పాలలో కొన్ని పదార్థాలు కలిపి…
Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం.…
Apply Oil Benefits Of Belly : వైద్యశాస్త్రం ప్రకారం మానవ శరీరంలో ఏడు ప్రధాన బిందువులలో ఒకటిగా పేర్కొనబడిందే…
Redmi A5 : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ అయిన షియోమీ తాజాగా భారత మార్కెట్లో బడ్జెట్ ఫోన్ Redmi A5ను…
AP 10th Class Results : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా…
This website uses cookies.