YS Jagan : జగన్ మీద కడుపు మంటతో ఏమేమి చేస్తున్నారో చూడండి !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: June 25, 2023, 9:00 pm

YS Jagan : ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించే చర్చ నడుస్తోంది. అయితే.. వారాహి యాత్ర ముఖ్య ఉద్దేశం సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే అనిపిస్తోంది. తనకు జగన్ పై ఎంత కక్ష ఉందో స్పష్టంగా వారాహి యాత్రలో చెప్పుకొస్తున్నారు. అసలు వారాహి యాత్ర ఉద్దేశం ఏంటి.. అనేది అందరికీ తెలుసు. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉండటంతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు తెలుసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న యాత్ర ఇది. కానీ.. తీరా యాత్ర మొదలయ్యాక చూస్తే అసలు పవన్ వారాహి యాత్రను ప్రారంభించింది కేవలం సీఎం జగన్ ను తిట్టడం కోసమే అన్నట్టుగా ఉంది.

గత కొన్ని రోజుల నుంచి ఆయన ప్రసంగాలు చూస్తే అదే అనిపిస్తుంది. నాకు ప్రభుత్వంపై ఎలాంటి కక్ష లేదంటారు.. సీఎంపై కూడా వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష లేదంటారు.. మళ్లీ సీఎంపై విమర్శల వర్షం కురిపిస్తారు. నన్ను పాలించే నాయకుడు నాకంటే.. నిజాయితీ పరుడై ఉండాలి.. అప్పుడే న్యాయం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మరి.. ఒక్క జగనే కనిపిస్తున్నారా.. చంద్రబాబు, లోకేశ్ బాబు కనిపించడం లేదా? అంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు.సాధారణంగా ఏ రాజకీయ నేత అయినా ప్రతిపక్ష నేతలను విమర్శిస్తారు. కానీ.. పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయ విమర్శలకు కారణాలు మాత్రం తెలియడం లేదు.

why pawan kalyan showing extreme anger on ys jagan

why pawan kalyan showing extreme anger on ys jagan

YS Jagan : పవన్ కళ్యాణ్ కొత్త తరహా రాజకీయ విమర్శలకు కారణం ఏంటి?

రాజకీయంగా అసలు వైఎస్ జగన్ కు ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు. పవన్ కళ్యాన్ ఏమాత్రం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తనే జగన్ కు అసలు ప్రత్యర్థిని అనుకొని అలా ఇష్టం ఉన్నట్టుగా జగన్ పై విమర్శలవర్షం కురిపిస్తున్నారా అర్థం కావడం లేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ కు రాజకీయం తెలుసా.. తెలిసి కూడా అలాగే ప్రవర్తిస్తున్నారా? మరి.. ఇలా పవన్ కళ్యాణ్.. జగన్ ను టార్గెట్ చేసుకొని ఇలాంటి రాజకీయాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది స్పష్టం కావడం లేదు. పవన్ విద్వేష రాజకీయాలపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు కదా.. వేచి చూడాల్సిందే.

Breaking News 2

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp