BJP : బీజేపీ తీరు టీడీపీ కి నచ్చడం లేదా.. ఏపీలో ఈ రకంగా పట్టు పెంచుకుంటుందా..?
BJP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడినప్పటికీ, మూడు పార్టీలు తమ తమ బలం పెంచుకునే వ్యూహాత్మక కదలికలతో ముందుకెళ్తున్నాయి. ఇందులో బీజేపీ మాత్రం ప్రత్యేకంగా నాయకత్వ ధోరణిలో వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి ఉదారంగా సాయం అందిస్తూ, రాజకీయంగా మాత్రం పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా రాజ్యసభ నియామకాల్లో బీజేపీ చూపిన ధోరణి టీడీపీ కేడర్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
BJP : బీజేపీ తీరు టీడీపీ కి నచ్చడం లేదా.. ఏపీలో ఈ రకంగా పట్టు పెంచుకుంటుందా..?
రాజకీయంగా చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, బీజేపీ ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రానికి కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీకి ఇప్పటికీ రెండు రాజ్యసభ స్థానాలు దక్కాయి. తాజాగా పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వ్యక్తులకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఖండిస్తున్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ స్థానం, పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీటు ఇవ్వడం బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ తన పట్టు మరింత బలపర్చే దిశగా సాగుతోంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నా, తాము తీసుకునే నిర్ణయాలకు మిత్రపక్షాలు వ్యతిరేకంగా ఉండలేని పరిస్థితులు సృష్టిస్తోంది. వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు రావడంతో రెండు సీట్లు టీడీపీకి, మరో రెండు బీజేపీకి కేటాయించడం గమనార్హం. జనసేనకు మాత్రం ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, బీజేపీ రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.