Categories: ExclusiveNewspolitics

Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం… మరేవరి వల్ల కాదు…!

అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉన్న భారతదేశంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ముఖ్యమంత్రిగా ఎదగటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఇలాంటి ఘనత భారతదేశంలో అతి తక్కువ మంది మాత్రమే సాధించారు. మహారాష్ట్రలో శంకర్రావు చవాన్ – అశోక్ చవాన్ , జమ్మూ కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా – ఫరూక్ అబ్దుల్లా , ఉత్తరప్రదేశ్లో మూల్యం సింగ్ యాధవ్ – అఖిలేష్ యాదవ్ , ఇక కర్ణాటకలో దేవె గౌడ – కుమారస్వామి , తమిళనాడులో కరుణానిధి – ఎంకె స్టాలిన్ వీరు మాత్రమే ఈ అరుదైనా ఘనతను సాధించారు. ఇక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాలో చేరారు.

Ys Jagan : తెలుగువారెవరికి దక్కని ఘనత…

ఈ విధంగా భారతదేశం మొత్తంలో అనేక రాష్ట్రాలలో తండ్రి కొడుకులు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం చూసాం. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం వైయస్ జగన్ ఒక్కడే ఈ అరుదైన ఘనతను సాధించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలువురు ముఖ్యమంత్రి కుమారులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ వారు ఎవరు ఈ ఘనతను సాధించలేకపోయారు. అయితే తండ్రి అకాల మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగక ముందే వైయస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతోనే జగన్ ఛాన్స్ కోల్పోయారు. ఆ తర్వాత 2019లో మాత్రం ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే భారతదేశంలో ఇప్పటివరకు తండ్రి తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. మహారాష్ట్రలో చవాన్ లు , ఒడిస్సాలో పట్నాయక్ లు , యూపీలో మూలయం అఖిలేష్ , కర్ణాటకలో దేవె గౌడ కుమారస్వామి ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఇప్పుడు వైయస్ జగన్ ముందు ఈ అరుదైన రికార్డు నిలిచిందని చెప్పాలి. ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలిస్తే ఈ ఘనత సాధిస్తారు.

Ys Jagan : అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జగన్ కు మాత్రమే దక్కిన అరుదైన గౌరవం… మరేవరి వల్ల కాదు…!

Ys Jagan : తండ్రికి తగ్గ తనయుడు…

అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో జరిగిన ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒంటి చేత్తో తన పార్టీని గెలిపించుకున్నారు. ఈ విధంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత సొంతంగా పార్టీ స్థాపించుకున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014లో పరాజయం పొందినప్పటికీ 2019లో ఘనవిజయం సాధించి పవర్ చేజిక్కించుకున్నారు. ఇక ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైయస్ జగన్ గెలిచినట్లయితే తన తండ్రి రికార్డును సమం చేస్తారు. భారతదేశం మొత్తం ఎవరికీ సాధ్యం కానీ ఈ ఘనతను జగన్ అందుకుంటారు. మరి ఈ ఘనత జగన్ కు లభిస్తుందా లేదా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Recent Posts

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

9 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

12 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

15 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

17 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

20 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

22 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

2 days ago