
#image_title
YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ. చంద్రబాబు అరెస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటున్నారు. కావాలని కక్ష సాధింపు చర్యలకు సీఎం జగన్ పాల్పడ్డారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ కాస్త యూటర్న్ తీసుకొని అది రోజా వైపు మళ్లింది. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన రోజాపై బండారు సత్యనారాయణ ఫైర్ అవడంతో ఆ ఇష్యూ కాస్త సీరియస్ అయింది. ఈ ఘటనపై తాజాగా సీఎం జగన్ కూడా స్పందించారు. గతంలో చంద్రబాబు పాలన గురించి అందరికీ తెలుసు. 2014 నుంచి 2019 మధ్య ఆ పాలన చూస్తే కనీసం పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం అయినా ఇచ్చిన పాపాన పోలేదు ఆ మనిషి. ఈరోజు తేడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ పెద్ద మనిషి చంద్రబాబుకు వేల కోట్ల రూపాయల సంపద ఉంది కానీ.. ఈ పెద్ద మనిషికి సంపద ఉంది కానీ.. కుప్పంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు ఆయన ఒక్క సెంటు కూడా స్థలం ఇవ్వని పరిస్థితిలో పాలన చేశాడు.. అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.
కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలు, 8 వేల ఇళ్ల నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పుకొచ్చారు. ఆ పెద్ద మనిషి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఈ పెద్ద మనిషి 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. మూడు సార్లు సీఎంగా చేశాడు. అయినా కూడా అక్కడ పేద వాడి ముఖంలో చిరునవ్వు కనపడాలి అంటే.. ప్రతి పేద వాడి గడపకు మంచి జరగాలి అంటే.. అది జరిగింది ఎప్పుడు అంటే.. అది మళ్లీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జరిగింది. 35 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ.. ఈ పెద్ద మనిషి రాష్ట్ర ప్రజల మీద కానీ.. రాష్ట్రం మీద కానీ.. కుప్పం ప్రజల మీద గానీ.. ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు. అనురాగం లేదు. బాధ్యత లేదు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయి.. ఈ పెద్ద మనిషి రాష్ట్రంలో కానీ.. కుప్పంలో కానీ ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు.
#image_title
చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది అంటే.. పక్క రాష్ట్రం హైదరాబాద్ లో కనిపిస్తుంది. అది ఈ రాష్ట్రంతో ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం. ఇది ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఈ పెద్ద మనిషికి ఉన్న అనుబంధం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్లు అవుతోంది. చంద్రబాబు అనే వ్యక్తి కంటిన్యూగా ఒక్క నెల అయినా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు మాత్రమే రాజమండ్రిలో కనిపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలంతా ఆలోచన చేయండి. అందరినీ కోరుతున్నా.. అందరూ ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్రం ఆయనకు కానీ.. ఆయన్ను సమర్థించే వారికి కానీ.. ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉందా ఆలోచన చేయండి.. అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
This website uses cookies.