
YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ... విభేదాలే కారణమా...?
YS vijayamma : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ వైయస్ విజయమ్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంతవరకు ఏపీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండకుండా దూరంగా వెళ్లేందుకు ఆమె నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆమె విదేశాలకు పయనం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేంత వరకు తిరిగి దేశంలోకి అడుగుపెట్టేది లేదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనికోసం ఆమె అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె సన్నిహిత వర్గాల నుండి వినిపిస్తున్న మాటలు. అయితే విజయమ్మ ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వైయస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు అని చెప్పాలి. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా అంటున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం వైయస్ జగన్ వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కావాలని వైయస్ జగన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలను జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి ఆయన నెగ్గితే చాలు ఇక తిరుగు ఉండదు. కానీ ఓడితే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విజయమ్మ కుమారుడు జగన్ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే ఆమె కుమార్తె షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరి కడప గడ్డ నుండి జగన్ కు సవాల్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు పూర్తిగా సపోర్ట్ చేసిన విజయమ్మ ఏపీలోకి వచ్చిన తర్వాత మాత్రం షర్మిల ను పూర్తిగా పక్కన పెట్టేసారని చెప్పాలి. అంటే సొంత కొడుకు కూతురు ఈ విధంగా ఉండడం ఆమెకు ఇష్టం లేదని చెప్పాలి. అయితే విజయమ్మ కూడా జగన్ మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారట. అదేవిధంగా జగన్ కి ఎదురుగా నిలబడుతున్న షర్మిలను కూడా దీవిస్తున్నారు. కానీ పూర్తి మద్దతు ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేక ఇద్దరు బిడ్డల మధ్య షర్మిలమ్మ నలిగిపోతోంది.
YS vijayamma : అసెంబ్లీ ఎన్నికల వేళ విదేశాలకు పయనమవుతున్న విజయమ్మ… విభేదాలే కారణమా…?
ఈ నేపథ్యంలోనే ఎవరికి వారు తమ పార్టీ తరుపున ప్రచారాలు చేయాల్సిందిగా కోరుతుంటే ఏదో ఒక పక్షాన ఉండడం విజయమ్మ కి అసలు ఇష్టం లేదు. దీంతో ఎవరి పక్షం ఉండకుండా తల్లిగా తన బిడ్డలు ఇద్దరు క్షేమాన్ని కోరుకుంటున్నారు విజయమ్మ. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉండటం కంటే విదేశాలకు వెళ్లి కొన్నాళ్లపాటు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని విజయమ్మ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే తిరిగి ఆమె ఏపీలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ న్యూస్ విన్న నేటి జనులు ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మొత్తానికి విజయమ్మ ఈసారి ఏపీ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు దేశాన్ని విడిచి దూరంగా వెళ్తున్నారన్నమాట.
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
This website uses cookies.