Reddy Community : వైసీపీ ఓటమికి కారణం రెడ్డి సామాజిక వర్గమేనా...!
Ysrcp : హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నికలలో గెలుపెవరిది అనే దానిపై కొద్ది రోజులుగా చర్చలు నడుస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయడం ఖాయమని వైసీపీ చెబుతుండగా, ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది విశ్వసమా..అతి విశ్వాసమా..అసలు ఏంటి వైసీపీ నేతల ధీమా.
ముందస్తుగా ఈ ప్రచారం ఎందుకు? గెలిచిన తర్వాత ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి? ఈ ముందస్తు హడావిడి ఏంటి? నిజంగా విశాఖలో ఆ పరిస్థితి ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీని గురించి చర్చ ఓ రేంజ్లో నడుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అది మొదలు.. అసలు విశాఖలో ఖాళీ ఉండదని.. నింగి, నేల అంతా వైసీపీ మయం అయిందని ప్రచారం ప్రారంభించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హోటల్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ప్రయాణానికి అంత ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రచార ఆర్భాటం ప్రారంభించిందో.. రాష్ట్రవ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది.
Ysrcp : వైసీపీ అతి ప్రచారమే వారి కొంప ముంచబోతుందా..?
నిజంగా విశాఖలో హోటళ్లు దొరకడం లేదా? రైలు, బస్సుల టిక్కెట్లు దొరకడం లేదా? రిజర్వేషన్లు దొరకడం లేదా? అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. కానీ ఇలా ఆరా తీయక ముందే.. హోటల్లు, రిసార్టులు తమకు తాము ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురు ప్రకటనలు చేస్తున్నాయి. ఇక బస్సు సర్వీసులు అయితే.. జూన్ 9 నాటికి, అంతకుముందు నాటికి ఎక్కువ టికెట్లు ఖాళీగా చూపుతున్నాయి. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం అతి అని తెలుస్తోంది. అది మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తోంది. ఎన్నికల తరువాత ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో 2019 లో వచ్చిన 151 అసెంబ్లీ..22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి రానున్నారు. అయితే, పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీ శ్రేణుల్లో నిజంగా జగన్ చెప్పినట్లుగా 151 కంటే ఎక్కువ సీట్లు సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
This website uses cookies.