ICC One Day World Cup 2023 : క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లంటే ఎలా ఉండాలి చెప్పండి. క్షణక్షణం ఉత్కంఠ రావాలి. కానీ.. ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్లలో అంత సీన్ లేదు. దానికి కారణం.. ఏ మ్యాచ్ చూసినా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగుతున్నాయి. ముందే విన్నర్ ఎవరో కూడా డిసైడ్ అయిపోయాక ఇక మ్యాచ్ చూస్తే ఏంటి.. చూడకపోతే ఏంటి. ప్రతి మ్యాచ్ అలాగే సాగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం నిస్తేజులవుతున్నారు. బాబోయ్.. ఇవేం మ్యాచులురా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. అవును.. నిన్న కాక మొన్న జరిగిన దాయాదుల పోరు కూడా అంతే కదా. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలా జరగాలి. ప్రతి క్షణం ఒక ఉత్కంఠ పరిస్థితి కలగాలి. కనురెప్ప కూడా వేయకుండా ఏం జరుగుతుందా? అని క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోవాలి. కానీ.. అక్కడ జరిగింది వేరు. వార్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. భారత్ చిరకాల ప్రత్యర్థితో ఆడే ఆటలో కూడా పస లేదు అంటూ ఊసురుమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
వరల్డ్ కప్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే అదే జరిగింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జసరిగింది. అది కూడా వార్ వన్ సైడ్ అన్నట్టుగానే సాగింది. ఇక.. ఇంగ్లండ్ అప్ఘనిస్తాన్, భారత్ ఆస్ట్రేలియా, భారత్ అఫ్ఘనిస్థాన్, భారత్ పాకిస్థాన్ ఇలా.. ప్రతి మ్యాచ్ అంతే. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్ మాత్రమే కాస్త ఎంటర్ టైన్ మెంట్ అందించిందని చెప్పుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లలో ఈ టోర్నీలోనే భారత్ పాక్ పోరు మాత్రమే అత్యంత పేలవంగా సాగింది. ఇదివరకు మ్యాచ్ లు చూస్తే భారత్, పాక్ మధ్య భీకరయుద్ధమే సాగిందని చెప్పుకోవచ్చు.
ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్ లు రావడం, టీ20 ఫార్మాట్స్ రావడంతో ఆటగాళ్లు కూడా 20 ఓవర్ల మ్యాచ్ కే అలవాటు పడినట్టు కనిపిస్తోంది. 50 ఓవర్లు అనేసరికి.. అన్ని ఓవర్లు కంటిన్యూగా ఫామ్ లో ఉండి ఆడలేకపోతున్నారు. టీ20 ఫార్మాట్ కే అలవాటు పడి సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. 50 ఓవర్ల వరకు అదే ఫామ్ ను మెయిన్ టెన్ చేయలేకపోతున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.