Dhanashree Verma : నేను మీ అమ్మ, చెల్లి లాంటి దానిని అని మరవద్దు.. చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆగ్రహం..!
Dhanashree Verma : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీలపై ఏ రేంజ్లో విమర్శలు జరుగున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.అయితే రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ను ఆపేయాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ నెటిజన్స్ని కోరింది. తమపై విద్వేశం చూపకుండా ప్రేమని పంచాలంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది. తాను అందరు అనుకున్నట్టు తప్పుడు మనిషిని కాదని చెప్పిన ధనశ్రీ, కుటుంబానికి తప్పక విలువలు ఇస్తానని పేర్కొంది. వివరాలలోకి వెళితే ధనశ్రీ ఇటీవల తన సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
తరచూ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అలరిస్తుంది.ఇటీవల డ్యాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్న ధనశ్రీ తన కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్తో కలిసి ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియా లో పంచుకుంది. దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి ట్రోలింగ్ రీఎదురైంది. ఆమెపై దారుణమైన కామెంట్స్ చేయడంతో ధనశ్రీ తన ఇన్స్టా ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసి ట్రోలర్స్కి గట్టి సమాధానం ఇచ్చింది. ట్రోల్స్ వలన తన ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొంది. ట్రోల్స్ వలన తన ఫ్యామీలీ చాలా ప్రభావితం అవుతందని కూడా తెలియజేసింది.
ఇక ఈ ట్రోల్స్ వలన ధనశ్రీ కొంత కాలం పాటు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. నేను నా జీవితంలో ఎప్పుడూ ట్రోల్స్, మీమ్స్ బారిన ఏ విషయంలో పడింది లేదు. అయితే ఈ సారి నేను చేసిన పని నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర ప్రభావితం చేసిందంటూ పేరం్కొంది. ఇది మీకు ఎలా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది కాబట్టి దీనిపై స్పందిస్తారని ఆశిస్తున్నాను అని ధనశ్రీ పేర్కొంది. ఇక చాహల్ విషయానికి వస్తే ఒకప్పుడు అద్భుతమైన బౌలింగ్తో అలరించాడు.ఇప్పుడు అవకాశాల కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ధనశ్రీ 2014లో నవీ ముంబైలోని డీవై పాటిల్ కాలేజీ నుంచి డెంటిస్ట్రీ చదవగా, ఆ సమయమంలో ఆమె డాక్టర్ కాకుండా ఫిట్నెస్ ట్రైనర్, కొరియోగ్రాఫర్, యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకుంది. 2020లో చాహల్ని పెళ్లి చేసుకుంది ధనశ్రీ
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.