Sourav Ganguly: టీం ఇండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీని తప్పించడంపై అతని అభిమానులు మండి పడుతున్నారు. అకారణంగా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే, బీసీసీఐ టీం ఇండియా క్రికెటర్ల గురించి ఏ నిర్ణయం తీసుకున్న దానికి ఓ కారణం ఉంటుంది. ఎందుకంటే సెలెక్టర్లతో పాటు సీనియర్ ఆటగాళ్ల సూచనలు, సలహాలు తీసుకున్నాకే అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకుంటాడు. దీనంతటికీ ఒక ప్రాసెస్ ఉంటుంది. విరాట్ కోహ్లీ మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్కు కెప్టెన్గా తప్పుకుంటానని ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే జట్టుకు మాత్రం అతనే కెప్టెన్గా కొనసాగాలి.
కానీ, అనుకోకుండా విరాట్ను తప్పించి వన్డే జట్టుకు కూడా రోహిత్ కెప్టెన్గా నియమించారు.టీం ఇండియాలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. ప్రపంచ స్థాయి మెరుగైన ఆటగాళ్లలో కోహ్లీ పేరు తప్పకుండా ఉంటుంది. మిస్టర్ కూల్ ధోని కెప్టెన్గా తప్పుకున్న తర్వాత విరాట్ కోహ్లీ వన్డే, టీ20, టెస్టు జట్టుకు రథసారధి అయ్యాడు. అప్పటి నుంచి జట్టును తన భుజాలపై భారాన్ని మోస్తూ వచ్చాడు. అయితే, ఒత్తిడి కారణంగా ఇప్పటికే టెస్టు క్రికెట్ కెప్టెన్సీ వదులుకోగా, పొట్టి ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పాలని భావించాడు. అనుకుంటే వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్గా తప్పుకున్నాడు. కానీ, వన్డే కెప్టెన్ గా ఎందుకు తప్పించారంటూ బీసీసీఐపై కోహ్లీ ఫ్యాన్స్ విరుచుకపడుతున్నారు.తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. విరాట్ తొమ్మిదేళ్ల నుంచి 3 ఫార్మాట్ల క్రికెట్ ఆడుతున్నాడు. ఐదేళ్ల నుంచి కెప్టెన్గా కొనసాగాడు. అతనిపై ఎంతో ఒత్తిడి పెరిగింది. ఫలితంగా అది అతని ఆటపై ప్రభావం చూపుతోంది. అందుకే టీ 20లకు కెప్టెన్గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేలకు కొనసాగుతానన్నాడు. కానీ, సెలెక్టర్లు మాత్రం వైట్ బాల్తో ఆడే టీ20, వన్డేలకు ఒకరే కెప్టెన్గా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కోహ్లీకి చెబితే సానుకూలంగా స్పందించాడు. అందుకే కోహ్లిని తప్పించి అతని స్థానంలో రోహిత్కు బాధ్యతలు అప్పగించామని గంగూలీ వెల్లడించారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.