ICC World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో భారత్ దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాపై గెలిచింది. అసలే సొంత గడ్డ.. ఇక్కడ గెలవకపోతే ఎలా ఉంటది చెప్పండి. అందుకే ఈసారి టైటిల్ ఫేవరేట్ గా భారత్ వరల్డ్ కప్ బరిలోకి దిగింది. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆదిలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే రెండు రన్స్ కే మూడు వికెట్లు పోయాయి. దీంతో ఇక మ్యాచ్ పని అయిపోయింది అనుకున్నారు క్రికెట్ అభిమానులు. తొలి మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోబోతోంది అనుకున్నారు. కానీ.. టీమిండియాను విరట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గెలిపించారు. ఇద్దరూ కలిసి పార్టనర్ షిప్ తో 165 పరుగులు తీశారు. దెబ్బకు భారత్ గెలుపు వైపు పరుగులు తీసింది.
విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరికి వచ్చి 85 పరుగులు చేసి అవుట్ కాగా.. అప్పుడు బ్యాటింగ్ కి దిగిన హార్ధిక్ పాండ్యా.. కేఎల్ రాహుల్ సెంచరీ చేయకుండా మిస్ చేశాడని అంటున్నారు. ఎందుకంటే.. రాహుల్, పాండ్యా ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేఎలా రాహుల్ 93 పరుగులు చేశాడు. అంటే.. ఇంకో 7 పరుగులు చేస్తే రాహుల్ సెంచరీ చేసినట్టే. అందుకే రాహుల్ ముందు ఒక ఫోర్ కొట్టి.. ఆ తర్వాత 6 కొడితే మ్యాచ్ అయిపోతుంది.. మరోవైపు తన సెంచరీ కూడా పూర్తవుతుంది అని భావించాడు. తను 93 పరుగులు చేసినప్పుడు కేవలం 5 పరుగులు మాత్రమే ఇంకా కావాల్సి ఉంది భారత్ కు. అదే సమయంలో ఫోర్ కొట్టాడు. 97 పరుగులకు మైలురాయికి చేరుకున్నాడు. ఇంకో సిక్స్ కొట్టి సెంచరీ చేద్దామనుకున్నాడు. కానీ.. 40వ ఓవర్ లో హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు. రాహుల్ సెంచరీని కూడా మిస్ చేశాడు.
ఒకవేళ పాండ్యా సిక్స్ కొట్టకుండా ఉంటే.. రాహుల్ సెంచరీ పూర్తయ్యేదని.. రాహుల్ సెంచరీ పూర్తి కాకుండా పాండ్యా అడ్డుకున్నాడని అంటున్నారు. హార్ధిక్ పాండ్యాను సెంచరీ విలన్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదివరకు వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కూడా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఇప్పుడు ఇలా రాహుల్ విషయంలో సెంచరీ మిస్ అయింది.. అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.