
Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్రకటించిన అంపైర్స్
Ind Vs Aus : ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే ఎంతటి మజా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ ముందు ఊరించే లక్ష్యం నమోదైంది. 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేయడంతో భారత్ ముందు 275 పరుగుల లక్ష్యం నమోదైంది. చివరి రోజు ఆటలో ఇంకా 56 ఓవర్ల ఆట మిగిలింది. వర్షం అంతరాయం కలిగించకుండా ఉండకుండా 56 ఓవర్ల ఆట సాగితే మ్యాచ్ ఫలితం తేలే అవకాశం ఉంది. ఐదో రోజు మాత్రం స్టేడియం దగ్గర ఉరుములు, మెరుపులు, పిడుగుపాటు వల్ల అంపైర్లు ఆటను నిలిపేశారు. తర్వాత కాసేపటికే జోరుగా వర్షం కురిసింది.
Ind Vs Aus : గబ్బా స్టేడియం దగ్గర మెరుపులు, పిడుగుపాటు సంకేతాలు.. మ్యాచ్ డ్రాగా ప్రకటించిన అంపైర్స్
చివరి రోజు కూడా ఉదయం 4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టీమిండియా తన చివరి వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 8 పరుగులు జోడించి 260 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ (31)ను ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు. బుమ్రాతో కలిసి ఇండియాను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన ఆకాశ్ దీప్.. చివరి వికెట్ గా వెనుదిరిగాడు. బుమ్రా 10 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాకు 185 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే ఆటని ఆపివేయడానికి గల కారణాన్ని అంపైర్ సైమన్ టాఫెల్ వివరించాడు.. ఐసీసీ 30-30 మెరుపుల నిబంధన ప్రకారం ఓ మెరుపు కనిపించి 30 సెకన్లలోపు పిడుగుపాటు శబ్దం వినిపిస్తే వెంటనే ఆట ఆపేయాలి. అంపైర్లు గబ్బా స్టేడియంలో అదే చేశారు. ఒకవేళ తుఫాను దూరంగా వెళ్లిపోతూ, 30 సెకన్లకు కాస్త అటూఇటూగా ఈ పిడుగుపాటు జరిగితే అంపైర్లు తమ విచక్షణ మేరకు ఆటను కొనసాగించే నిర్ణయం తీసుకోవచ్చట
గబ్బా స్టేడియంలో మెరుపు చాలా దగ్గరగా కనిపించిందని, 30 సెకన్లలోపే పిడుగు పడిన శబ్దం రావడంతో ఆటను అంపైర్లు నిలిపేసినట్లు చెప్పాడు. ఇది ప్లేయర్స్, అఫీషియల్స్, గ్రౌండ్ స్టాఫ్, ప్రేక్షకుల భద్రత కోసం తీసుకొచ్చిన నిబంధన అని తెలిపాడు. నవంబర్ లో పాకిస్థాన్ టీమ్ ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు తొలి టీ20 మ్యాచ్ ఈ పిడుగుపాటు వల్ల ఆలస్యమైంది. ఆ మ్యాచ్ కూడా గబ్బా స్టేడియంలోనే జరగడం గమనార్హం.రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్కు భారత బౌలర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. జస్ప్రీత్ బుమ్రా(3/18), ఆకాశ్ దీప్(2/28), మహమ్మద్ సిరాజ్(2/38) నిప్పులు చెరగడంతో ఆసీస్ 85 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ కాసేపటికే ఆ జట్టు డిక్లేర్ చేసింది. Ind Vs Aus australia and india Test match drawn ,
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
This website uses cookies.