
india vs pakistan champions trophy
india vs pakistan : ఇండియన్ క్రికెట్ టీంకు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఏదేని మ్యాచ్లో ఇండియా బరిలోకి దిగితే చాలు… విన్ అవ్వాలని ఆకాంక్షించేవారు చాలా మందే ఉన్నారు. ఇకపోతే దాయాది దేశమైన పాకిస్థాన్తో భారత్ తలపడినట్లయితే కంపల్సరీగా భారత్ గెలవాలని భారత అశేష ప్రజానీకం కోరుకుంటుంది. కాగా, చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఒకవేళ పాకిస్థాన్తో తలపడితే అందులో ఇండియా విజయం సాధించాలని ప్రతీ ఒక్క భారతీయుడు కోరుకుంటాడు.
ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండంటే చాలు ఇరు దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోయి చూస్తుంటారు. లైవ్ అప్డేట్స్ తెలుసుకుంటుంటారు. కాగా, పాకిస్థాన్ కంట్రీతో డిఫరెన్సెస్ కారణంగా కొన్నాళ్లుగా ఇండియా ఆ దేశంలో పర్యటనలు చేయడం మానుకుంది. ఈ క్రమంలోనే 2025లో చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆతిథ్యాన్ని భారత్ స్వీకరించి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పార్టిసిపేట్ చేసేనా? అనే విషయమై క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఇండియా ఆ ట్రోఫీలో పాల్గొంటుందా ? అనే విషయమై ఇంత వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో ఆ మ్యాచ్ పట్ల ఇంకా ఆసక్తి పెరిగింది.
india vs pakistan champions trophy
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనుందా? అనే అంశంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాకిస్థాన్ దేశంలో గతంలో పర్యాటకులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే అప్పటి పరిస్థితులను బట్టి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్పై భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు కేంద్రమంత్రి. క్రీడా శాఖ మంత్రి చేసిన ప్రకటనను బట్టి చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనేందుకు సిద్ధంగ లేదని కొందరు వాదిస్తుండగా, అప్పటి పరిస్థితులను బట్టి తప్పనిసరిగా భారత్ పాల్గొంటుందని మరి కొందరు అంటున్నారు. చూడాలి మరి.. అప్పటి వరకు దాయాది దేశమైన పాకిస్థాన్ కంట్రీకి వెళ్లి మరి.. ఆ దేశంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొంటుందో లేదో..
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
OPPO Find X9 Ultra Review : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) గ్లోబల్ మార్కెట్లో తన మోస్ట్…
Central Govt Good News to Telangana : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి భారీ వరాలను ప్రకటించింది. మత్స్యకారుల…
Gold, Silver Rate Today, 11 February 2026 : ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక…
This website uses cookies.