T20 World Cup : అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ అందినట్టే అంది చేజారింది. ఈ సారి టీ 20 వరల్డ్ కప్ దక్కించుకోవాలనే కసితో టీమిండియా ఉంది. అందుకోసం ఇటీవల భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించింది. ఇందులో వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు అవకాశం ఇచ్చింది. వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఐపీఎల్లో రాణిస్తున్న శివమ్ దూబె, యుజ్వేంద్ర చాహల్లకు జట్టులో అవకాశం కల్పించింది. ఇక షెడ్యూల్ని కూడా ఇప్పటికే ప్రకటించడం మనం చూశాం.
జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. అయితే టోర్నీలో జూన్ 26, 27 తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరగనుండగా, వీటి షెడ్యూల్ విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. టీ20 ప్రపంచ కప్లో రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ 4గంటలకి బదులుగా 8గంటలకి షెడ్యూల్ చేశారు. అంటే దీనికి రిజర్వ్ డే లేదని తెలుస్తుంది. దీనికి బదులు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజునే మ్యాచ్ని పూర్తి చేయాలని ఐసీసీ ఆలోచన చేస్తున్నట్టుగా ఓ టాక్ వినిపిస్తుంది. అయితే అలా చేయడానికి కారణం కూడా లేకపోలేదు. రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే అంటే జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగడమే ఇందుకు కారణం.
మొదటి సెమీ ఫైనల్ జూన్ 26న ట్రినిడాడ్లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో వర్షం కురిస్తే మాత్రం రిజర్వ్ డే ఉంటుంది. రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ జూన్ 27న గయానాలో జరుగుతుంది. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ రెండో సెమీఫైనల్ మ్యాచ్లో వర్షం పడితే ఈ టీ20 మ్యాచ్ నిడివి ఎనిమిది గంటలకి చేరుతుంది. కాబట్టి రిజర్వ్ డే అవసరం లేదంటోంది ఐసీసీ. మరి ఈ మార్పులు టీమిండియాకి ఏమైన ప్రతి కూలంగా మారే అవకాశం ఉందా అని టెన్షన్ పడుతున్నారు క్రికెట్ అభిమానులు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.