
pakistan fan breaks tv after losing
Pakistan Fan : ఆదివారం పాకిస్తాన్ – ఇండియా మధ్య హోరాహోరీగా మ్యాచ్ నడిచిన విషయం తెలిసిందే. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ సాగగా, చివరకు టీమిండియా విజయాన్ని సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లకు 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చేజింగ్ మాస్టర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్ 53 బంతుల్లో 6×4, 4×6) భారత క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించాడు.
160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి 113 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో కోహ్లీ జట్టును తిరిగి మ్యాచ్లోకి తీసుకువచ్చాడు. భారత్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ మ్యాజిక్ కారణంగా.. చివరి 6 బంతులకు 16 రన్స్ అవసరం అయ్యాయి.కోహ్లీ ఉన్నాడనే ధైర్యం తప్ప భారతీయులకి మ్యాచ్పై ఏ మాత్రం నమ్మకం లేదు. అయితే చివరకి వరకు మొబైల్, టీవీ దగ్గర నుంచి పక్కకు కూడా జరగలేదు. కళ్లార్పకుండా ప్రతి బంతిని చూశారు.
pakistan fan breaks tv after losing
స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ వేసిన నో బాల్ కారణంగా భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అవ్వడంతో మ్యాచ్ మరింతరసవత్తరంగా సాగింది. దాంతో భారత్, పాకిస్తాన్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. దాంతో భారత అభిమానులు సంబరాలు చేసుకోగా, ఇంట్లో మ్యాచ్ చూస్తున్న ఓ పాక్ అభిమాని.. అసహనంలో టేబుల్పై ఉన్న లాప్ టాప్ను తీసి టీవీపై విసిరాడు. కిందపడేసి కాలితో తన్నాడు. దాంతో టీవీ బద్దలైంది. ఇందుకు సబంధించిన వీడియోని సెహ్వాగ్ నెట్టింట్లో షేర్ చేయగా, తెగ వైరల్ అవుతుంది. గతంలోను ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం.
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
This website uses cookies.