Pakistan Fan : ఆదివారం పాకిస్తాన్ – ఇండియా మధ్య హోరాహోరీగా మ్యాచ్ నడిచిన విషయం తెలిసిందే. చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు మ్యాచ్ సాగగా, చివరకు టీమిండియా విజయాన్ని సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లకు 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. చేజింగ్ మాస్టర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్ 53 బంతుల్లో 6×4, 4×6) భారత క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించాడు.
160 పరుగుల లక్ష్య ఛేదనలో 31 పరుగులకే భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6)తో కలిసి 113 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో కోహ్లీ జట్టును తిరిగి మ్యాచ్లోకి తీసుకువచ్చాడు. భారత్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లీ మ్యాజిక్ కారణంగా.. చివరి 6 బంతులకు 16 రన్స్ అవసరం అయ్యాయి.కోహ్లీ ఉన్నాడనే ధైర్యం తప్ప భారతీయులకి మ్యాచ్పై ఏ మాత్రం నమ్మకం లేదు. అయితే చివరకి వరకు మొబైల్, టీవీ దగ్గర నుంచి పక్కకు కూడా జరగలేదు. కళ్లార్పకుండా ప్రతి బంతిని చూశారు.
స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ వేసిన నో బాల్ కారణంగా భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అవ్వడంతో మ్యాచ్ మరింతరసవత్తరంగా సాగింది. దాంతో భారత్, పాకిస్తాన్ అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. దాంతో భారత అభిమానులు సంబరాలు చేసుకోగా, ఇంట్లో మ్యాచ్ చూస్తున్న ఓ పాక్ అభిమాని.. అసహనంలో టేబుల్పై ఉన్న లాప్ టాప్ను తీసి టీవీపై విసిరాడు. కిందపడేసి కాలితో తన్నాడు. దాంతో టీవీ బద్దలైంది. ఇందుకు సబంధించిన వీడియోని సెహ్వాగ్ నెట్టింట్లో షేర్ చేయగా, తెగ వైరల్ అవుతుంది. గతంలోను ఇలాంటి సంఘటనలు చాలానే చూశాం.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.