
T20 World Cup : గిల్, పాండ్యాకి వరల్డ్ కప్లో నో ఛాన్స్.. వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టు ఇదేనా..?
T20 World Cup : ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ రంజుగా సాగుతుంది.ఈ సారి ఎవరు కప్ కొడతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఐపీఎల్ తర్వాత వరల్డ్ కప్ సమరం మొదలు కానుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు టైటిల్ కోసం పోటీపడనుండగా, ఈ టోర్నీ కోసం మే 1న టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు. అయితే భారత జట్టు ఎంపిక విషయంలో బీసీసీఐ తికమక పడుతుంది. ఎవరిని ఎంపిక చేయాలి, ఎవరిని పక్కన పెట్టాలని చాలా ఆలోచిస్తుంది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో ఏం చేయాలో బోర్డుకు తెలియడం లేదు.టీ 20 ప్రపంచ కప్ లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మరోసారి రిషబ్ పంత్కు సెలక్షన్ కమిటీ అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
గతంలో రిషభ్ పంత్ టీమిండియా సారథిగా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఓవరాల్గా టీ20 ప్రపంచ కప్ లో రిషబ్ పంత్ వికెట్ కీపర్ తో పాటు కెప్టెన్ గా కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ.. టీ20 ప్రపంచకప్ ఎంపికపై కసరత్తులు ప్రారంభించింది. ఇటీవలే ఢిల్లీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో సమావేశమై తుది జట్టు ఎంపికపై సుదీర్ఘ చర్చలు చేసింది.యువ ఓపెనర్ శుభ్మన్ గిల్తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించినట్లు తెలుస్తోంది. టాపార్డర్ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్లను ఎంపిక చేసినట్లు సమాచారం.
T20 World Cup : గిల్, పాండ్యాకి వరల్డ్ కప్లో నో ఛాన్స్.. వరల్డ్ కప్ భారత క్రికెట్ జట్టు ఇదేనా..?
వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, రిషభ్ పంత్ను ఎంపిక చేశారని, ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను పరిగణించనున్నారని తెలుస్తోంది. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆడనుండగా.. స్పెషలిస్ట్ ఫినిషర్గా రింకూ సింగ్ ఎంపికైనట్లు సమాచారం.స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసిన సెలెక్టర్లు యుజ్వేంద్ర చాహల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ పేసర్లుగా కొనసాగనుండగా.. మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ల మధ్య పోటీ నెలకొంది. రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, కేఎల్ రాహుల్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.