
Beers : లైట్ బీర్లు దొరడకడం లేదంటూ ఎక్సైజ్ డీఎస్పీకి లేఖ రాసిన తాగుబోతు సంఘం అధ్యక్షుడు
Beers : భానుడి భగభగలతో ఎక్కువ మంది చల్లని పానీయాలపై ఫోకస్ చేస్తున్నారు. ఎండలో తిరిగిన వారు బాగా అలసిపోవడంతో చల్లని పాలనీయాలపై ప్రభావం చూపుతుంది. ఇక చల్లని బీర్లని తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బీర్లకి ఎక్కువ ఆదరణ లభిస్తుండడంతో మద్యం షాపులలో నో స్టాక్స్ లభిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు వైన్ షాపుల్లో కూల్ లైట్ బీర్లు లేవని బోర్డులే దర్శనం ఇస్తున్నాయి. ఇతర కంపెనీల బీర్లు దొరుకుతున్నా, కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలో ఏకంగా తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్ జిల్లా ఎక్సైజ్ అధికారులకు బీర్లు దొరకడం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
తాగుబోతుల సంఘం అధ్యక్షుడు రాసిన లేఖ ఇలా ఉంది. “నా పేరు కొట్రంగి తరుణ్, తాను తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడినని పేర్కొన్నాడు. గత 18 రోజులలో రాష్ట్రానికి రూ.670 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపాడు. కానీ కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు ఏ వైన్ షాప్లో గాని, బార్లలో గాని లభ్యం కావడం లేదని తెలిపాడు. ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రజలకు ముఖ్యంగా యువకులకు పెద్దలకు దాహం తీర్చుకునేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని తమ దృష్టికి వచ్చిందని లేఖలో తెలిపాడు. ఈ జిల్లాలోనే కాదు కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదు.
Beers : లైట్ బీర్లు దొరడకడం లేదంటూ ఎక్సైజ్ డీఎస్పీకి లేఖ రాసిన తాగుబోతు సంఘం అధ్యక్షుడు
ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుంది ఆ తర్వాత తమ పనులను చేసుకోగలుగుతాము అంటూ వివరించాడు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని తెలిపాడు. తమకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి చల్లటి కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో, బార్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోమని కోరాడు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు తాగే ప్రతి ఒక్కరి తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నాడు. తమకు సహకరించినట్లయితే రాష్ట్ర ఆదాయాన్ని మరింత రెట్టింపు చేయుటకు తమవంతు కృషి చేస్తామని తెలిపాడు.
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
This website uses cookies.