Rohit Sharma : సెమీఫైనల్ లో ఆ ఇద్దరు ఆటగాళ్లకు సంబంధించి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :10 November 2022,7:30 am

Rohit Sharma : మరికొద్ది క్షణాల్లో T20 వరల్డ్ కప్ టోర్నీ రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో గెలవడంతో పాకిస్తాన్ ఫైనల్ కి చేరుకుంది. దీంతో ఇంగ్లాండ్ మరియు భారత్ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడనున్నారు. ఈ క్రమంలో రెండో సెమీఫైనల్ కి సంబంధించి జరగనున్న మ్యాచ్ విషయంలో మీడియా సమావేశంలో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకి గాయం అయిందని మ్యాచ్ ఆడటం లేదని వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ నేను ఫిట్ గా ఉన్నాను. సెమీ ఫైనల్ లో అందుబాటులో ఉంటాను. అంతేకాదు జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ కి పంత్.. మరియు దినేష్ కార్తీక్ కూడా అందుబాటులో ఉంటారు. ఇక ఇదే సమయంలో టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Rohit Sharma comments about semifinal match

Rohit Sharma comments about semifinal match

స్కోర్ ఎలా ఉన్నా ఎంత ఒత్తిడిలో మ్యాచ్ ఉన్నా గాని సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగల సత్తా ఉన్న ఆటగాడని తెలిపారు. దీంతో సెమీఫైనల్ కి ఆడటం లేదని.. వస్తున్న వార్తలకు రోహిత్ చెక్ పెట్టడంతో టీమిండియా క్రికెట్ ప్రేమికులు… సంతోషంగా ఉన్నారు. ఇంగ్లాండ్ తో ఎలాగైనా మ్యాచ్ గెలిచి ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడి మరోసారి t20 ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నారు.

sekhar

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి