Virat Kohli : గత కొద్ది రోజులుగా భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ హాట్ టాపిక్గా మారుతున్నాడు. ముఖ్యంగా కోహ్లీ విషయంలో గంగూలీ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి గంగూలీ మాట్లాడుతూ… పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒకే సారథి ఉండాలన్న భావనతో సెలక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాడు. తాను టీ20 కెప్టెన్సీ వైదొలగవద్దని చెప్పినా కోహ్లి వినలేదని, అందుకే ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లి ఈ వ్యాఖ్యలను ఖండించాడు. తనను ఎవరూ సంప్రదించలేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో గంగూలీ తీరుపై విమర్శల జడి కురిసింది.
అయితే కోహ్లీ, గంగూలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని , అది కనుక సెట్ అయితే భారత క్రికెట్ కి మంచి రోజులు వచ్చినట్టే అని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి అనాలోచిత నిష్క్రమణ బీసీసీఐతో అతని సంబంధాన్ని ప్రశ్నార్థకం చేసిందంటూ కామెంట్ చేశాడు. చాలా మంది మాజీలు కూడా ఈ సమస్యపై తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. కోహ్లి, బీసీసీఐ మధ్య చీలిక అంత మంచిది కాదని, దీనికోసం ఇరువర్గాలు ఒక అడుగు దిగి మాట్లాడుకుంటే మంచిదంటూ సూచనలు కూడా చేశారు. తాజాగా గౌతమ్ గంభీర్ కూడా ఈ కోవలోకే చేరాడు.కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలను “అంతర్గత యుద్ధం” గా గంభీర్ అభివర్ణించాడు.
“ఇది అంతర్గత యుద్ధం. ఇది చాలా చిన్న విషయం. దాని లోతుకు వెళితే, విషయం సులభంగా ఉంటుంది. ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ఇరువర్గాలు శాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది” అని టైమ్స్ నౌతో మాట్లాడుతూ గంభీర్ పేర్కొన్నాడు. ఇక రెడ్ బాల్ కెప్టెన్గా కోహ్లీ ఉంటే బాగుంటుంది. టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం విరాట్ వ్యక్తిగత నిర్ణయం. అతను కొనసాగించాల్సిన అవసరం ఉంది “అని గంభీర్ పేర్కొన్నాడు.ఇక ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేలు, మూడు టీ20ఐలలో తలపడే భారత వైట్-బాల్ జట్టులో కూడా సభ్యుడిగా భాగమయ్యాడు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.