Sanju Samson: టీమిండియా ఆటగాళ్లకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆడని ఆటగాళ్లకు పదే పదే ఛాన్స్ లు ఇవ్వడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా, ఇందుకోసం భారత్ ఇప్పటి నుంచే కసరత్తులు ఆరంభించింది. ఈ క్రమంలోనే వెంట వెంటనే వన్డే సిరీస్ లు ఆడుతుంది.ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. వన్డే సిరీస్ పూర్తి కాగానే బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ తో పాటు రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడనుంది.
అయితే టీమిండియాలో సుస్థిరమైన స్థానం కోసం సంజూ సామ్సన్ గత కొంత కాలంగా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిభకు ఏ లోటు లేని ఈ ప్లేయర్ టీమిండియా మేనేజ్ మెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలకు ప్రతిసారి బలవుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన ఇతడికి టి20 సిరీస్ లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఇక వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సంజూ సామ్సన్ ఆకట్టుకునే విధంగా 36 పరుగలు చేశాడు. ఇదే మ్యాచ్ లో రిషభ్ పంత్ కేవలం 15 పరుగులకే ఔట్ అయ్యాడు. అయినప్పటికీ అతనికే అవకాశలు ఇస్తున్నారు. సంజూ సామ్సన్ కు వరుసగా ఒక 10 మ్యాచ్ లు ఆడే అవకాశం
ఇవ్వాలంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రిఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో రెండో మ్యాచ్లో సంజూ శాంసన్ను మళ్లీ తొలగించి అతని స్థానంలో దీపక్ హుడాకు అవకాశం కల్పించారు. అలాగే, గత మ్యాచ్లో చాలా భారీగా పరుగులు ఇచ్చిన షార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. శార్దూల్ను తప్పించడం సమంజసమే అయినా మొదటి మ్యాచ్లో ఆకట్టుకున్న సంజూను రెండో వన్డే నుంచి తప్పించడం తో అభిమానులు మండిపడుతున్నారు. ఫామ్లోనే పంత్ని ఆడించి శాంసన్ పై ఎందుకు వేటు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ గత 4 వన్డే ఇన్నింగ్స్ల్లో 86*, 30*, 2*, 36 పరుగులు చేసిన పాపం ఆయనకే ఎందుకిలా జరుగుతుంది అని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.