
team india won by 302 runs against srilanka in icc world cup 2023
IND VS Srilanka : అన్ని క్రికెట్ మ్యాచ్ లు ఒకే రకంగా ఉండవు. చాలా అరుదుగా కొన్ని మ్యాచ్ లు జరుగుతుంటాయి. అలాంటి మ్యాచ్ లలో ఈ మ్యాచ్ ఒకటి. అదే భారత్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్. అవును.. అసలు ఇది మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇక్కడ వార్ వన్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది. ఒక్కడి 357 పరుగులు.. ఎక్కడి 55 పరుగులు. శ్రీలంక కనీసం 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లు నష్టపోయి 357 పరుగులు చేసి.. శ్రీలంకకు 358 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. శ్రీలంక మాత్రం ఆవేశపడి 20 ఓవర్లు కూడా ఆడకుండా వికెట్లు అన్నీ పోగొట్టేసుకుంది. దీంతో 55 పరుగులతోనే శ్రీలంక సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో భారత్ 302 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ లో చేరిన తొలి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో సెమీస్ కు ఏ టీమ్ వెళ్లలేదు. సెమీస్ కు అర్హత సాధించిన తొలి టీమ్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 357 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 92 పరుగులు చేసి సెంచరీ దగ్గరికి వచ్చి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా సెంచరీకి దగ్గరికి వచ్చి 88 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రెయాస్ అయ్యర్ 82, రవీంద్ర జడేజా 35, కేఎల్ రాహుల్ 21, సూర్యకుమార్ యాదవ్ 1, షమీ 2, రోహిత్ శర్మ 4 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మదుషంక 5 వికెట్లు తీశాడు. దుష్మంత ఒక వికెట్ తీశాడు. ఇక శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంటే కాసున్ రజిత్ 14 పరుగులు, మహీశ్ తీక్షణ 12 పరుగులు, మాథ్యూస్ 12 పరుగులు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ డకవుట్ అయ్యారు. ఇక.. భారత బౌలర్లలో షమీ 5 వికెట్లు, సిరాజ్ 3 వికెట్లు, బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. 5 వికెట్లు తీసిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.