New Rules : గ్యాస్ నుండి ఏటిఎం వరకు రేపటి నుండి అన్ని రూల్స్ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే ఇబ్బందిలో పడతారు..!
New Rules : ఏప్రిల్ నెల నేటితో ముగియడంతో రేపటి నుండి మే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా కీలకమైన మార్పులు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు గ్యాస్ సిలిండర్ ధరల నుండి బ్యాంకింగ్ సేవలు, రైల్వే ప్రయాణ, ఎటిఎం విత్ డ్రా ఛార్జీల వరకు అనేక వాటిల్లో జరగబోతుంది. ముఖ్యంగా వంటింటి గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతీ నెల మొదటి తేదీన సమీక్షించటం పరిపాటి. ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉండగా, గత నెలలో ఇప్పటికే రూ.50 మేర పెరిగాయి. ఈ ధరల పెరుగుదల సామాన్యులపై బారం పెంచనుంది.
New Rules : గ్యాస్ నుండి ఏటిఎం వరకు రేపటి నుండి అన్ని రూల్స్ మారుతున్నాయి.. తెలుసుకోకపోతే ఇబ్బందిలో పడతారు..!
అలాగే రైల్వే వ్యవస్థలోనూ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇకపై వెయిటింగ్ టికెట్ కలిగిన ప్రయాణీకులు స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించలేరు. ఈ నిబంధనలు మే 1 నుండి అమలులోకి రానున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఎటిఎం విత్ డ్రా ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మూడు సార్లు ఎటిఎం విత్డ్రా ఫ్రీగా ఉండగా, నాలుగో సారి రూ.21 ఛార్జీ ఉండేది. కానీ మే 1 నుండి ఈ ఛార్జీ రూ.23కి పెరగనుంది. నగరాల్లో ఎక్కువసార్లు డబ్బు తీయాల్సినవారికి ఇది పెద్ద భారంగా మారనుంది.
ఇంకా FD మరియు సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించిన లోన్ల వడ్డీ రేటులోనూ మార్పులు ఉండొచ్చు. RBI ఇటీవల రెపో రేటును తగ్గించడంతో కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ వడ్డీ రేట్లను సవరించాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి తక్కువ వడ్డీ లభించవచ్చు. అదే సమయంలో లోన్ తీసుకునేవారికి కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న బ్యాంకులను కలిపి పెద్ద బ్యాంకుగా మార్చే ప్రణాళికను ఆర్బిఐ చేపట్టింది. ఇది గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపనుంది. అందువల్ల మే 1 నుండి అమలులోకి వచ్చే ఈ మార్పులు ప్రజల జీవన విధానంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండటంతో, అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
This website uses cookies.