Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
Simhachalam : విశాఖపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయం సమీపంలో ఇటీవల నిర్మించిన గోడ కూలిపోవడంతో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉండగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
Simhachalam : సింహాచలం.. ప్రమాదానికి కారణం అదేనా.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం..!
ఈ దుర్ఘటన చందనోత్సవ సమయంలో స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా తరలివచ్చిన భక్తుల మధ్య కలకలం రేపింది. రూ. 300 టికెట్ క్యూ లైన్ కోసం ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ వద్ద చాలా మంది భక్తులు రాత్రి నిద్రలో ఉన్న సమయంలో, 2 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న కొత్త గోడ వర్షానికి కూలిపోయింది. గోడ కూలిన వెంటనే శిథిలాల కింద చిక్కిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ గోడను కేవలం 20 రోజుల క్రితమే నిర్మించారని అధికారులు పేర్కొన్నారు.
దీనివల్ల నిర్మాణ నాణ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. కాంక్రీట్ బీమ్ లేకుండా 20 అడుగుల గోడను నిర్మించడం గమనార్హం. వర్షపు నీరు మట్టితో కలసి గోడపై ఒత్తిడి పెంచడంతో, ఆ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అధికారులు గోడకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో మరింత ప్రాణనష్టం తప్పినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులు ఎవరనే విషయంపై కాంట్రాక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, అనీల్ రావిపూడి కాంబోకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం మనం చూశాం. త్వరలోనే ఈ…
Women Loan Schemes : తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో అన్నపూర్ణ…
Balakrishna : నందమూరి నట సింహం బాలకృష్ణ Balakrishna, rajinikanth సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ jailer 2 కలిసి…
New Ration Cards : రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి…
TS SSC 10th Results 2025 : తెలంగాణ పదోతరగతి పరీక్షల 10th Results download ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని…
Vaibhav Suryavanshi : ఇటీవల రాజస్తాన్ తరపున సునామి ఇన్నింగ్స్ ఆడిన యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేక…
New Rules : ఏప్రిల్ నెల నేటితో ముగియడంతో రేపటి నుండి మే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో…
Summer Hacks : మండుటెండలను భరించలేకపోతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే భయాందోళనలకు గురిచేస్తుంది. మధ్యతరగతి కుటుంబంకులకు ఏసీలు…
This website uses cookies.