Redmi A1 : కేవలం 7వేల లోపే స్మార్ట్ ఫోన్… రెడ్ మీ నుంచి మరో కొత్త ఫోన్…!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 16 October 2022, 7:00 am

Redmi A1 : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉండడంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఇండియాలో రెడ్ మీ ఏ1+ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ ను షావోమీ సబ్ బ్రాండ్ అయినా రెడ్ మీ తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లెదర్ టెక్చర్ ఫినిష్ ఉన్న బ్యాక్ ప్యానెల్ తో రెడ్ మీ ఏ1+ వచ్చింది. రెడ్ మీ ఏ1 తో పోలిస్తే ఈ స్మార్ట్ ఫోన్ కొత్త అప్ గ్రేడ్లతో వచ్చింది. ఎంఐయుఐ కాకుండా దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటుంది. రెడ్ మీ ఏ1+ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.

2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.6999 గా ఉంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ మోడల్ ధర రూ.7999 గా ఉంది. ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ కామర్స్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ mi.com , ఎంఐ హోమ్స్ లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. ఇంట్రక్టరీ ధరలు ఈనెల 31 తారీకు వరకు ఉంటాయి. ఆ తర్వాత రెడ్ మీ ఏ వన్ ప్లస్ రెండు వేరియంట్ ధరలు రూ.7,499 గా 2 జీబీ ర్యామ్ ఉంటుంది. రూ.8499 గా 3 జీబీ ర్యామ్ ఉంటాయని రెడ్ మీ వెల్లడించింది. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. 6.52 హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే తో రెడ్ మీ ఏ1+ వస్తుంది.

Redmi A1 phone under just 7 thousand

Redmi A1 phone under just 7 thousand

400 నిట్స్ పిక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో ఏ22 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. మైక్రో ఎస్ బీ కార్డ్ స్లాట్ ఈ ఫోన్ లో ఉంటుంది. రెడ్ మీ ఏ1+ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా మరో లెన్స్ కూడా ఉంటుంది. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఐదు మెగా పిక్సెల్ ప్రంట్ కెమెరా ఈ ఫోన్ కు ఉంది. రెడ్ మీ ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. పది వాట్ల స్టాండర్డ్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ 192 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 4జి ఎల్ టిఈ, వైఫై బ్లూటూత్ 5, జిపిఎస్, 3.5mm హెడ్ ఫోన్ జాక్, యూఎస్ బీ టైప్ సి పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి