Categories: NewsTechnology

TNPSC Exam : వినూత్న ప్ర‌యోగం.. ప‌రీక్ష ప‌త్రాల మూల్యాంక‌నంలో ఏఐ వినియోగం..!

Advertisement
Advertisement

TNPSC Exam : పరీక్షల్లో తెల్ల కాగితాన్ని న‌ల్ల‌గా చేస్తే చాటు, ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారనే విద్యార్థుల ధీమాకు ఇక‌పై చెక్ ప‌డ‌నుంది. తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TNPSC) సమాధాన పత్రాలను వేగంగా మూల్యాంకనం చేయడానికి సరికొత్త సాంకేతికతను ప్రవేశపెడుతుందని ఆ రాష్ట్ర‌ ఆర్థిక మరియు మానవ వనరుల నిర్వహణ మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ ప్రకటించారు. పరీక్షలు పేపర్ ఆధారిత మోడ్ నుండి కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మోడ్‌కి కూడా మార‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Advertisement

TNPSC Exam AIతో మూల్యాంకన ప్రక్రియ

మూల్యాంకన ప్రక్రియలో మరింత పారదర్శకత మరియు సామర్థ్యాన్ని నిర్ధారించడానికి మరియు TNPSC ఫలితాలను త్వరగా ప్రచురించడానికి కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించబడుతుంది. ప్రతి సంవత్సరం వివిధ పోస్టుల కోసం TNPSC పరీక్షలకు సుమారు 40 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. ఈ అభ్యర్థుల మూల్యాంకన ప్రక్రియకు భారీ మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరులు అవసరం కాబట్టి ఫలితాలు ఆలస్యమవుతున్నాయి.

Advertisement

సమాధానాలను దిద్దేందుకు స్కాన్‌ చేసిన కాపీని ఏఐకి అనుసంధానిస్తున్నారు. ఆ కాపీని ఏఐ పరిశీలించి త‌ప్పుడు, తిరగరాసిన విషయాల్ని పట్టేస్తుంది. వెంటనే సంబంధిత ప్రొఫెసర్‌ను అలర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతానికి మూల్యాంకనంలో ఏఐకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వట్లేదు. ప్రొఫెసర్లకు సహాయంగా ఉండే ఒక టూల్‌గానే వాడ‌నున్నారు. భవిష్యత్‌లో దీని సామర్థ్యాన్ని క్రమంగా పెంచి మూల్యాంకనంలో కీలకంగా ఉపయోగించాలనేది త‌మ‌ లక్ష్యం అని ఆ రాష్ట్ర ప్రణాళికా కమిషన్‌ కార్యదర్శి ఎస్‌.సుధ వెల్లడించారు.

TNPSC Exam : వినూత్న ప్ర‌యోగం.. ప‌రీక్ష ప‌త్రాల మూల్యాంక‌నంలో ఏఐ వినియోగం..!

ఏఐతో మూల్యాంకన ప్రయోగాల కోసం 4 యూనివర్సిటీలను ఎంపిక చేశారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. సమాధాన పత్రాల్ని ఆయా వర్సిటీల్లో బోధకులే మూల్యాంకనం చేస్తున్నారు. దానికి ముందు అవే సమాధాన పత్రాల్ని ఏఐతోనూ మూల్యాంకనం చేయిస్తున్నారు. రెండు విధానాల్లో మూల్యాంకనం తీరును, మార్కులు వేయడంలో వైరుధ్యాలు, ఏఐ పనితీరును ప్రొఫెసర్లు, అధికారులు గమనిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. వచ్చిన ఫలితాలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల్ని అనుసంధానించటంతో పాటు విషయ పరిజ్ఞానానికి సంబంధించిన నియమ నిబంధనలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలపై నివేదికలను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు.

Advertisement

Recent Posts

Job Mela : మిరాకిల్ కాలేజీలో మినీ జాబ్ మేళా.. జీతం రూ.3.50 ల‌క్ష‌లు

Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…

11 mins ago

Jaggery : బెల్లం తో కూడా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా…!!

Jaggery :  బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…

1 hour ago

Namo Bharath Rapid Rail : ఇక నుంచి వందే భారత్ కాదు.. వందే మెంట్రో..!

Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…

10 hours ago

Johnny Master : జానీ మాస్టర్ కేసు.. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుందా..?

Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…

11 hours ago

Janhvi kapoor : దేవర కోసం జాన్వి కపూర్ కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..?

Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…

12 hours ago

Chandra Dosham : చంద్ర దోష నివారణకు ఈ పరిహారాలు తప్పక పాటించండి… సనాతన ధర్మం ఏం చెబుతుందంటే…!

Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…

13 hours ago

Chandrababu : మోదీని చూసి బాబు ఎందుకు అంత ఉప్పొంగిపోతున్నారు.. అసలు విష‌యం తేల్చ‌ట్లేదుగా..!

Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండ‌గా,…

14 hours ago

Hyper Aadi : జానీ మాస్ట‌ర్ బాగోతాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌టికి.. హైప‌ర్ ఆది అప్ప‌ట్లోనే చెప్పేశాడుగా..!

Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే.. కేవలం…

15 hours ago

This website uses cookies.