Bandi Sanjay : తెలంగాణా లో BJP వస్తే CM బండి..?
Bandi Sanjay తెలంగాణ బీజేపీలో కీలక మార్పులపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బండి సంజయ్కు మళ్లీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం వెనుక అసలు కారణాలేంటి?
Bandi Sanjay : తెలంగాణలో వచ్చే రోజుల్లో బీజేపీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టేందుకు ఆ పార్టీ అధిష్ఠానం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. “ఆరు నూరు అయినా ఈసారి తెలంగాణలో కమలం జెండా ఎగరాల్సిందే” అనే లక్ష్యంతో పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో కీలక మార్పులు, నేతల మధ్య సమన్వయం, పార్టీలోకి తిరిగి చేరికలు వంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కు మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఆయనకు ఆర్ఎస్ఎస్తో పాటు కేంద్ర నాయకత్వం నుంచి కూడా మంచి మద్దతు ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పనిచేసిన సమయంలో పార్టీ సాధించిన ఫలితాలను కూడా అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.
Bandi Sanjay : తెలంగాణా లో BJP వస్తే CM బండి..?
Bandi Sanjay బండి సంజయ్కు మళ్లీ పగ్గాలు ఎందుకు?
బండి సంజయ్ గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ దూకుడు పెరిగిందనే అభిప్రాయం ఉంది. ఆయన నాయకత్వంలో పలు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 50 మంది వరకు కార్పొరేటర్లను గెలుచుకోవడం అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ దూకుడుగా పోరాటం చేసింది. అధికార పార్టీపై నేరుగా విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపడుతూ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో బీజేపీలో జోష్ తగ్గిందనే విమర్శలు కూడా అప్పట్లో వినిపించాయి.ఇప్పుడు అదే నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బండి సంజయ్కు మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.మరోవైపు తెలంగాణలో పార్టీ బలాన్ని అంచనా వేసేందుకు బీజేపీకి చెందిన పలువురు కీలక నేతలు రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని వారు గుర్తించినప్పటికీ.. దాన్ని పూర్తిస్థాయిలో ఓట్లుగా మార్చుకునేలా పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సి ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
ముఖ్యంగా నాయకుల మధ్య విభేదాలు, వర్గపోరు పార్టీకి నష్టం చేస్తున్నాయని కొన్ని నివేదికల్లో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి కీలక నేతలు కలిసి పనిచేయడం కూడా పార్టీలో ఐక్యతకు సంకేతంగా భావిస్తున్నట్లు సమాచారం. మరికొందరు నాయకుల మధ్య కూడా సమన్వయం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Bandi Sanjay తెలంగాణపై నితిన్ నబీన్ ఫోకస్.. కీలక మార్పులకు రంగం సిద్ధం?
తెలంగాణలో పార్టీని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులైన నితిన్ నబీన్ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆయన రెండు, మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించినట్లు సమాచారం. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి తెలంగాణకు వచ్చి రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారనే చర్చ కూడా సాగుతోంది. జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా మరింత అప్రమత్తంగా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.పార్టీలో ప్రతి నాయకుడికి తగిన ప్రాధాన్యం, అవకాశం కల్పిస్తామని అధిష్ఠానం చెబుతున్నట్లు సమాచారం. ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదనే సంకేతాలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్కు కూడా భవిష్యత్తులో కీలక అవకాశం దక్కవచ్చనే ప్రచారం మొదలైంది.
బండి సంజయ్కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశాన్ని కూడా అధిష్ఠానం పరిశీలించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మరోవైపు బీజేపీకి దూరమైన కొందరు ఫైర్బ్రాండ్ నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరగవచ్చనే ప్రచారం ఉంది. ముఖ్యంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వంటి నేతలను మళ్లీ పార్టీతో కలిపే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా తెలంగాణ బీజేపీలో సంస్థాగతంగా పూర్తి స్థాయిలో మార్పులు, నాయకుల మధ్య సమన్వయం, కీలక నేతలకు కొత్త బాధ్యతలు, పార్టీకి దూరమైన నేతలను తిరిగి తీసుకురావడం వంటి అంశాలపై అధిష్ఠానం దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ మార్పులన్నింటినీ పూర్తి చేసి దసరా నాటికి తెలంగాణ బీజేపీ పగ్గాలను కేంద్ర మంత్రి బండి సంజయ్కు అప్పగించే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమై బండి సంజయ్కు మరోసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. తెలంగాణలో బీజేపీ రాజకీయ దూకుడు మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







