Bandla Ganesh : మల్లారెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ..!

Advertisement
Advertisement

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.2024 లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై బండ్ల గణేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇంద్రవెల్లి సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు…

Advertisement

విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారు మల్లారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా అని అన్నారు. నిజాయితీగా తెలంగాణకు పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతం అని, రాబోయే అన్ని ఎంపి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. మల్లారెడ్డి పిచ్చిపిచ్చి ఆరోఫణలు చేస్తూ ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేశా అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే తీసుకునేది లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఉన్నాయనే అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు, చరిత్రలో రాజ్యాలే కూలిపోయాయి డబ్బున్న వాడు బికారి కూడా అవుతాడు.

Advertisement

డబ్బు అనే అహంకారంతో మల్లారెడ్డి సీఎం ను వాడు వీడు అని మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. సీఎం రేవంత్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు. రోజుకు 20 గంటలు పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. సీఎం పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు అని అన్నారు. ఇక పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. దీనికోసం హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మినీ ఇండియా గా పేరు ఉన్న మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరికి ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి.

Advertisement
Advertisement

Recent Posts

Gold, Silver Rate Today, 12 February 2026 : తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు ..ఈరోజు పెరిగిన ధర చూస్తే !!

Gold, Silver Rate Today, 12 February 2026 : హైదరాబాద్‌ పసిడి మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు…

22 minutes ago

Brahmamudi February 12th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 12 ఎపిసోడ్: రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అప్పూ.. ఆస్తి కోసం ధాన్యలక్ష్మి గొడవ!

Brahmamudi February 12th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ సీరియల్ 'బ్రహ్మముడి' రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠగా…

52 minutes ago

Biryani Leaf Benefits : బిర్యానీ ఆకులు రుచికే కాదు .. ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలివే ..!

Biryani Leaf Benefits : మన వంటింట్లో తరచుగా కనిపించే బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కేవలం వంటకాలకు సువాసన,…

2 hours ago

Dates vs Almonds : ఖర్జూరం vs బాదం ఆరోగ్యానికి ఏది మంచింది.. ఏది మీకు ఎక్కువ ప్రయోజనం తెలుసా ?

Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…

3 hours ago

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు 12 ఫిబ్రవరి 2026 : ఈ రాశుల వారికి ఈరోజు ధన లాభం.. మీ రాశి ఫలితాలు ఇక్కడ చూడండి..!

Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…

4 hours ago

Velidanda Village : వెలిదండ గ్రామం భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం..!

Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…

12 hours ago