
big shock to cm kcr in gajwel constituency
Gajwel : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఓటర్లను బతిమిలాడుకుంటున్నారు. తమకే ఓటేయాలంటూ కోరుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ ఎన్నికల హడావుడే నెలకొన్నది. తెలంగాణలో ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. బీజేపీ పార్టీ అంతగా యాక్టివ్ గా కనిపించకున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు. తమదే గెలుపు అంటూ ఎవరికి వాళ్లే చెప్పుకుంటున్నారు. కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉండగా.. మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం హాట్ టాపిక్ గా నిలిచాయి. అందులో గజ్వేల్ నియోజకవర్గం ఒకటి. గజ్వేల్ అనగానే మనకు గుర్తొచ్చేది గులాబీ అధినేత సీఎం కేసీఆర్. ఆయన సొంత నియోజకవర్గం అది. ఆయన గ్రామం చింతమడక కూడా అదే నియోజకవర్గంలో ఉంది.
గజ్వేల్ లో కేసీఆర్ ఇప్పటి వవరకు చాలాసార్లు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు. గజ్వేల్ లో పోటీ అంటే వార్ వన్ సైడ్ అనే అనుకోవాలి. అక్కడ సీఎం కేసీఆర్ ను కాదని ఎవ్వరు పోటీ చేసినా గెలుపు కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. అయితే.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కారు పార్టీ అధినేత కేసీఆర్ కు ఎన్నికలకు ముందే షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి గజ్వేల్ నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు నిలిచారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
జిల్లాలో రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు చేయడం, అందులోనూ కేవలం గజ్వేల్ నుంచే 44 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అది కేసీఆర్ కు కొంత మైనస్ అనే చెప్పుకోవాలి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. కానీ.. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించేందుకే, కావాలనే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి.. కనీసం ఈసారైనా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించే సత్తా ఎవరికైనా ఉందా? అనేది వేచి చూడాల్సిందే.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.