Gajwel : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అభ్యర్థులంతా తమ నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఓటర్లను బతిమిలాడుకుంటున్నారు. తమకే ఓటేయాలంటూ కోరుతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఈ ఎన్నికల హడావుడే నెలకొన్నది. తెలంగాణలో ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. బీజేపీ పార్టీ అంతగా యాక్టివ్ గా కనిపించకున్నా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు. తమదే గెలుపు అంటూ ఎవరికి వాళ్లే చెప్పుకుంటున్నారు. కొన్ని సర్వే సంస్థలు మాత్రం బీఆర్ఎస్ వైపు ఉండగా.. మరికొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపు ఉన్నాయి. అయితే.. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం హాట్ టాపిక్ గా నిలిచాయి. అందులో గజ్వేల్ నియోజకవర్గం ఒకటి. గజ్వేల్ అనగానే మనకు గుర్తొచ్చేది గులాబీ అధినేత సీఎం కేసీఆర్. ఆయన సొంత నియోజకవర్గం అది. ఆయన గ్రామం చింతమడక కూడా అదే నియోజకవర్గంలో ఉంది.
గజ్వేల్ లో కేసీఆర్ ఇప్పటి వవరకు చాలాసార్లు పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటారు. గజ్వేల్ లో పోటీ అంటే వార్ వన్ సైడ్ అనే అనుకోవాలి. అక్కడ సీఎం కేసీఆర్ ను కాదని ఎవ్వరు పోటీ చేసినా గెలుపు కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. అయితే.. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో కారు పార్టీ అధినేత కేసీఆర్ కు ఎన్నికలకు ముందే షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి గజ్వేల్ నుంచి 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ఈ నాలుగు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు నిలిచారు. జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
జిల్లాలో రికార్డు స్థాయిలో నామినేషన్లు నమోదు చేయడం, అందులోనూ కేవలం గజ్వేల్ నుంచే 44 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో అది కేసీఆర్ కు కొంత మైనస్ అనే చెప్పుకోవాలి. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్యే ప్రధాన పోటీ జరగనుంది. కానీ.. గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించేందుకే, కావాలనే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి.. కనీసం ఈసారైనా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ను ఓడించే సత్తా ఎవరికైనా ఉందా? అనేది వేచి చూడాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.