Padi Kaushik Reddy : ఓటు వేయకపోతే హుజురాబాద్ లో మూడు శవాలు లేస్తాయి.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ..!

Advertisement
Advertisement

Padi Kaushik Reddy : తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకుంది. ఈరోజు (నవంబర్ 28) ప్రచారానికి చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చివరి ప్రచారం నిర్వహించిన హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ. . ప్రచారం అయితే చేసాను. ఇక మీ ఇష్టం. నాకు ఓటు వేయకపోతే మా ముగ్గురి శవాలను చూడండి. మీరు ఓటు వేసిన నన్ను గెలిపిస్తే జయయాత్రకు వస్తా, లేదంటే నాలుగో తారీఖున నా శవయాత్రకు మీరు రండి. మీకు దండం పెడతా, మీ కాళ్లు పట్టుకుంటా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. ప్రచారంలో తన భార్య బిడ్డలతో నిర్విరామంగా ప్రచారం చేశారు. ఇక చివరి రోజు ఈ వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశంగా మారారు. ఇక కౌశిక్ రెడ్డి తరఫున తన కూతురు శ్రీనిక చేసిన ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది. హుజురాబాద్ లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో శ్రీనిక తన తండ్రిని గెలిపించాలని, తన తండ్రిని గెలిపిస్తే హుజురాబాద్ కి రెండు వేల కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. అయితే హుజూరాబాద్ నుంచి బీజేపీ తరఫున ఈటల రాజేందర్ బరిలో ఉండటం గమనార్హం.

Advertisement

మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ మీద పోటీ చేసి పాడి కౌశిక్ రెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు. అయితే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇది కూడా ఒక రకంగా ఓటర్లను ప్రలోభ పెట్టినట్లే అవుతుందని, ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న కౌశిక్ రెడ్డి పై ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఈరోజు ముగియనుండడంతో అభ్యర్థులు ఎమోషనల్ అవడం సహజమే. కానీ కౌశిక్ రెడ్డి కొంచెం ఎక్కువ భావోద్వేగానికి గురయ్యారు.

ఇప్పుడు హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మంత్రిగాను చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీజేపీ లోకి వచ్చి చేరారు. అన్ని పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచారు. ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై బీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపింది. అప్పటికే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి టికెట్ ఆశించినా దక్కలేదు. ఈ సారి బీఆర్ఎస్ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తాను ఎలాగైనా గెలవాలని పాడి కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రచారంలో బాగా ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

38 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.