brs high command big shock to mlc palla rajeswar reddy
BRS : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీడియా ముఖంగా అధికార పార్టీ బీఆర్ఎస్ 115 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. ఇంకా 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం సీఎం కేసీఆర్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే.. 119 నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాలకు మాత్రం టికెట్లు ఫిక్స్ అయ్యాయి. ఇంకా మిగిలింది మాత్రం 4 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో జనగామ అతి ముఖ్యమైనది.
ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీటును బీఆర్ఎస్ కన్ఫమ్ చేయలేదు. అక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఉన్నారు. కానీ.. ఆయనపై భూకుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కూతురే ముత్తిరెడ్డి భూకుంభకోణాలను బయటపెట్టడంతో నియోజకవర్గం వ్యాప్తంగా ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే అది మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆయనకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ అధిష్ఠానం జనగామ టికెట్ ను పెండింగ్ లో పెట్టింది.అయితే.. బీఆర్ఎస్ అధిష్ఠానం ఇప్పటి వరకు టికెట్ ఎవరికి ఇస్తారో కన్ఫమ్ చేయలేదు. జనగామలో బీఆర్ఎస్ టికెట్ ఆశించే వారిలో ముత్తిరెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరు కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరొకరు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ కానీ..
brs high command big shock to mlc palla rajeswar reddy
ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నారు. పల్లా, ముత్తిరెడ్డి ఇద్దరితోనూ పర్సనల్ గా కేటీఆర్ చర్చించారట. ఇటీవల ఎమ్మెల్సీ పల్లా అనుచరులు సీక్రెట్ గా మీటింగ్ పెట్టారు. పల్లా ఆ మీటింగ్ కు వెళ్తుండగానే మార్గమధ్యంలో ఉండగానే మంత్రి కేటీఆర్ నుంచి ఆయనకు ఫోన్ రావడంతో తిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అసలు జనగామ టికెట్ ను బీఆర్ఎస్ అధిష్ఠానం ఎవరికి కేటాయిస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. 'ఆ డ్రాపింగ్' (Awe…
e Aadhaar App | భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్ కార్డులో చిన్న చిన్న…
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. తొలి దశలో…
This website uses cookies.