Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లో బోనాల చెక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి Rajitha Parameshwar Reddy పేర్కొన్నారు. తెలంగాణలో బోనాలే Telangana Bonalu ఇక్కడ ప్రజలకు ప్రాణాలని అభివర్ణించారు. Uppal ఉప్పల్ డివిజన్ లోని ఆలయాల నిర్వాహకులకు వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి బోనాల చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. ఇంకా చెక్కులు రాని ఆలయాల నిర్వాహకులు వివరాలను తన దృష్టికి తేవాలని సూచించారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి దృష్టికి తీసుకెళ్లి చెక్కులు మంజూరు చేయిస్తామన్నారు.

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లో బోనాల చెక్కులను పంపిణీ చేసిన కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి
Rajitha Parameshwar Reddy : బోనాలు నిర్వహించే ప్రతి ఆలయం వద్ద ఏర్పాట్లు
ఈ సందర్భంగా డివిజన్ లోని ఉప్పల్ పోచమ్మ దేవాలయం, బంగారు మైసమ్మ దేవాలయం న్యూ శాంతి నగర్, ఉప్పల్ ఈదమ్మ దేవాలయం, పోచమ్మ దేవాలయం పద్మావతి కాలనీ, ఉప్పలమ్మ దేవాలయం గాంధీ నగర్, నల్లపోచమ్మ దేవాలయం గాంధీ నగర్, పోచమ్మ దేవాలయం మల్ల బస్తీ భారత్ నగర్, ఎల్లమ్మ దేవాలయం ఉప్పల్ హిల్స్, ఇష్ట ఐశ్వర్య ఉప్పలమ్మ తల్లి దేవాలయం ఉప్పల్ మెయిన్ రోడ్, బోపాన్ చెరువు కట్ట మైసమ్మ దేవాలయం ఉప్పల్ బగాయత్, బంగారు మైసమ్మ తల్లి శ్రీనగర్ కాలనీ,
భూలక్ష్మి దేవాలయం న్యూ భారత్ నగర్, బంగారు మైసమ్మ దేవాలయం కావేరి నగర్, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ఉప్పల్ వెజిటేబుల్ మార్కెట్, తదితర ఆలయాల నిర్వాహకులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో బకారం లక్ష్మణ్ గారు,బీకుమల్లా అంజయ్య గుప్తా,ఈగ ఆంజనేయులు,మందుములజగన్ రెడ్డి,తుమ్మల దేవి రెడ్డి,సల్లా ప్రభాకర్ రెడ్డి,గండు భాస్కర్ రెడ్డి,గుమిడెల్లి నర్సింగ్ రావు,శ్రీనివాస్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి,తుమ్మల దేవేందర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,మోహన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు