
dk aruna vijayashanthi and konda vishweshwar reddy to join in congress
Congress : ప్రస్తుతం తెలంగాణలో పార్టీల మార్పు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు మారుతున్నారు. ఇంకా ఎన్నికలకు 25 రోజుల సమయమే ఉన్నా పార్టీలు మారే నాయకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకే నేతలు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అలాగే.. బీజేపీ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అన్ని పార్టీలకు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాత్రమే కాదు.. బీజేపీ నుంచి కూడా భారీగా నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న డీకే అరుణ, విజయశాంతి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్ గా లేరు. సైలెంట్ గా ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక ఈ ముగ్గురు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి.
బీజేపీలో సైలెంట్ గా ఉన్నప్పటికీ విజయశాంతికి ఉన్న స్టాటస్ వేరు. కానీ.. తనకు ఈసారి అసెంబ్లీ సీటు దక్కలేదు. దీంతో బీజేపీలో తను చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కనీసం ఎంపీ టికెట్ అయినా దక్కుతుందా అంటే డౌటే. అందుకే.. బీజేపీలో తగిన ప్రాధాన్యత లేదని గమనించిన విజయశాంతి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కాంగ్రెస్ నుంచి పిలుపు కూడా వచ్చిందట. లోక్ సభ ఎంపీ సీటు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో విజయశాంతి బీజేపీకి బైబై చెప్పి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణకు ఉన్న పాపులారిటీ వేరు. తను కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పని చేశారు. కానీ.. తాను బీజేపీలో చేరారు. అప్పటి నుంచి తనకు పార్టీలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. బీజేపీలో తను అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆయనకు చేవెళ్ల ఎంపీ సీటు కావాలని ముందే అడిగారట. దీంతో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొండా ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ లేదు.
pachhi chintapandu rasam recipe : పచ్చి చింతకాయలతో తయారుచేసే రసం అనేది మన తెలుగు ఇంటి వంటల్లో ఒక…
Coffee On Empty Stomach : చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే కాఫీతో తమ రోజును ప్రారంభిస్తారు. ఇది సాధారణంగా…
Health : వాము ఆకులు మనకు అందుబాటులో ఉండే సాధారణ మొక్కలలో ఒకటి అయినప్పటికీ వాటి ఔషధ విలువలు చాలా…
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
This website uses cookies.