
dk aruna vijayashanthi and konda vishweshwar reddy to join in congress
Congress : ప్రస్తుతం తెలంగాణలో పార్టీల మార్పు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు మారుతున్నారు. ఇంకా ఎన్నికలకు 25 రోజుల సమయమే ఉన్నా పార్టీలు మారే నాయకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకే నేతలు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అలాగే.. బీజేపీ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అన్ని పార్టీలకు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాత్రమే కాదు.. బీజేపీ నుంచి కూడా భారీగా నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న డీకే అరుణ, విజయశాంతి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్ గా లేరు. సైలెంట్ గా ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక ఈ ముగ్గురు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి.
బీజేపీలో సైలెంట్ గా ఉన్నప్పటికీ విజయశాంతికి ఉన్న స్టాటస్ వేరు. కానీ.. తనకు ఈసారి అసెంబ్లీ సీటు దక్కలేదు. దీంతో బీజేపీలో తను చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కనీసం ఎంపీ టికెట్ అయినా దక్కుతుందా అంటే డౌటే. అందుకే.. బీజేపీలో తగిన ప్రాధాన్యత లేదని గమనించిన విజయశాంతి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కాంగ్రెస్ నుంచి పిలుపు కూడా వచ్చిందట. లోక్ సభ ఎంపీ సీటు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో విజయశాంతి బీజేపీకి బైబై చెప్పి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణకు ఉన్న పాపులారిటీ వేరు. తను కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పని చేశారు. కానీ.. తాను బీజేపీలో చేరారు. అప్పటి నుంచి తనకు పార్టీలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. బీజేపీలో తను అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆయనకు చేవెళ్ల ఎంపీ సీటు కావాలని ముందే అడిగారట. దీంతో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొండా ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ లేదు.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.