Double Bedroom Houses : త్వరలో 4 వేల డబుల్ ఇండ్ల పంపిణీ.. ఎవరెవరికి అంటే..!
ప్రధానాంశాలు:
Double Bedroom Houses : త్వరలో 4 వేల డబుల్ ఇండ్ల పంపిణీ.. ఎవరెవరికి అంటే..!
Double Bedroom Houses : గ్రేటర్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 1400, సంగారెడ్డి 802. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 1043, రంగారెడ్డి జిల్లాలో 800 ఇండ్లు కలిపి 4 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 70 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, కొల్లూరులోనే అత్యధికంగా 15660 ఇండ్లు నిర్మించారు.

Double Bedroom Houses : త్వరలో 4 వేల డబుల్ ఇండ్ల పంపిణీ.. ఎవరెవరికి అంటే..!
66వేల ఇండ్లని లబ్ధి దారులకి అందజేయగా, ఇందులో 30వేల మంది ఇండ్లలోకి రాలేదు. వారు తాళాలు తీసుకొని వేరే ప్రాంతాలలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొందరు అద్దెలకి ఇచ్చి వేరే చోట ఉంటున్నారు. అయితే వారిని గుర్తిస్తున్న జిల్లాల కలెక్టర్స్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంట్లోకి రాకపోతే వేరే వాళ్లకి అప్పగించేందుకు రంగం రెడీ చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఉంటే ఉద్యోగాలకి దూరం అవుతుందని, అందుకే ఉండడం లేదని కొందరు అంటున్నారు. అయితే 2017 నుండి 2019 వరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం 7.10 లక్షల అప్లికేషన్స్ రాగా, ఇందులో 95 వేల మంది మాత్రమే అర్హులని అధికారులు గుర్తించి ఇళ్లు అందజేశారు. ఇంకా 25 వేల మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో నాలుగు వేల ఇండ్లని ఈ 25 వేల మంది నుండే గుర్తించనున్నారు.