
Free Current : ఉచిత కరెంట్.. సీఎం రేవంత్ రెడ్డి షాక్..!
Free Current : కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రెండు హామీలను అమలు చేసింది. మరో రెండు పథకాలను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పెట్టిన ఆరు గ్యారంటీలలో గృహజ్యోతి పథకం ఒకటి. ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రభుత్వానికి మీటర్ రీడర్లు జలక్ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వివరాలు నమోదు చేసుకోమని తేల్చి చెప్పారు. తమకు నెల అంతా పని కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివరాల నమోదు పనిని గుత్తేదారులకు ఇవ్వాలంటున్నారు. ఉచిత విద్యుత్ అమలు కోసం వినియోగదారుల ఫోన్, ఆధార్, రేషన్ కార్డ్ నెంబర్లను సేకరించాలన్నారు.
ప్రజా పాలనలో ఉచిత కరెంటు కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 81,54,158 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల్లో 30% మంది ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్లను సరిగా నమోదు చేయలేదని తేలింది. రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ అనుసంధానమై ఉన్న కరెంట్ కనెక్షన్ల ఇళ్లకు తొలి దశలో ఉచిత కరెంట్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గృహజ్యోతి పథకానికి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు ఈ మూడింటిని ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారిలో పది లక్షల మందికి అసలు రేషన్ కార్డులే లేవని తేలింది. ఇలాంటి వారికి తొలి దశలో ఉచిత కరెంటు సరఫరా ఇవ్వడం సాధ్యం కాదని సమాచారం.
రాష్ట్రమంతటా విద్యుత్ సిబ్బంది వివరాల నమోదు ప్రక్రియ పూర్తి అయ్యాక ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలనే దానిపై ప్రాథమికంగా లెక్కలు తేలనున్నాయి. ఈ ఉచిత కరెంట్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి లభిస్తుంది. అలాగే ఒక ఇంటికి ఒక మీటర్ ఉన్నవారికి పథకం అమలు అవుతుంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు సైతం ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకం వర్తించాలంటే వారు 200 యూనిట్లు లోపు విద్యుత్ వినియోగం చేసే వారై ఉండాలి. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. ఒక వినియోగదారుడు 1500 యూనిట్లు కరెంటు వాడితే దానికి 10% కలిపి 12 నెలలకు దానికి 10% కలిపి ఆ మొత్తం కరెంటును 12 నెలలకు విభజించి ఆ యూనిట్లను మాత్రమే ఉచితంగా ఇస్తారు. మిగతాది లెక్క కడతారు. ప్రతినెల మీటర్ రీడింగ్ తో పది రోజులు పాటు మొదటి వారంలోని ఉచిత విద్యుత్ లబ్ధిదారులు గుర్తింపు ఉంటుంది. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్ కు రేషన్ కార్డ్ , ఆధార్ కార్డ్ , మొబైల్ నెంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధంగా కరెంట్ ఫ్రీగా ఇచ్చే లబ్ధిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
Vijay Sai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు అత్యంత కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి రాజకీయ…
Tax Rules Gold : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు అది ఒక భావోద్వేగం…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే మంత్రివర్గ విస్తరణ. ముఖ్యంగా…
This website uses cookies.