
YS Sharmila : జగనన్న దేనికి ' సిద్ధం ' చెప్పు.. మరోసారి రెచ్చిపోయిన వైయస్ షర్మిల ..!
YS Sharmila : కొద్ది రోజులుగా యాత్రలకు విరామం ఇచ్చిన వైయస్ షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించిన విధంగా జనం తరలివచ్చారు.వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని వైఎస్ జగన్ ను ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయని ‘ సిద్ధం ‘ అంటూ బయటికి వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్ అని నిలదీశారు. మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా అని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారని, రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఇన్నాళ్లు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోదా రాదని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినా, వైయస్ జగన్ కి ఓటు వేసినా, పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాజ్యమేలుతుందని, హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తలెత్తుకునే రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. వైయస్సార్ గుర్తుతో గెలిచారని, గెలిచాక వైయస్సార్ ఆశయాలను మరిచారని, కనీసం వైయస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదని ఆరోపించారు.
వైఎస్ జగన్ పాలనలో అంతా మోసమే అని, అన్ని వర్గాలకు మోసమే అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఐదేళ్లలో పూర్తిగా మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని, ఐదేళ్ల తర్వాత మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడని, ఇప్పుడు ఉందా మద్యపాన నిషేధమని ప్రశ్నించారు. పదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. ఈ పదేళ్లలో పార్టీలు కనీసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని అన్నారు. ఇక ఈ రోడ్ షోలో వైయస్ షర్మిల తో పాటు సీనియర్లు కేవీపీ, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, కొప్పల రాజు వంటి వారు పాల్గొన్నారు. ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు పునర్జీవం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు వైయస్ షర్మిల.
Miryalaguda : ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడలో వార్షికోత్సవం మరియు 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను నేడు ఘనంగా…
YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ లభించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు…
Athadu Movie Re Release : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. పాత…
Anganwadi : తెలంగాణలో అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
HPV vaccine : బాలికల్లో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఇప్పుడు అత్యంత రసవత్తర దశలోకి అడుగుపెట్టింది.…
Vijay wife Sangeetha : తమిళ రాజకీయాల్లోనే కాకుండా దక్షిణాది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం…
Central Government : దేశవ్యాప్తంగా రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ…
Vijay-Rashmika : టాలీవుడ్లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త ఎట్టకేలకు నిజమైంది. అభిమాన జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ –…
Farmer Rights Law : భారతదేశంలో India వ్యవసాయం farming కోట్ల మందికి జీవనాధారం. అయితే, చాలా చోట్ల ఒకరి…
This website uses cookies.