
YS Sharmila : జగనన్న దేనికి ' సిద్ధం ' చెప్పు.. మరోసారి రెచ్చిపోయిన వైయస్ షర్మిల ..!
YS Sharmila : కొద్ది రోజులుగా యాత్రలకు విరామం ఇచ్చిన వైయస్ షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించిన విధంగా జనం తరలివచ్చారు.వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైఎస్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నా ఎప్పుడు ప్రజల మధ్యకు రారని వైఎస్ జగన్ ను ఎద్దేవా చేశారు. ఎన్నికలు వచ్చాయని ‘ సిద్ధం ‘ అంటూ బయటికి వచ్చారని, దేనికి సిద్ధం జగన్ సార్ అని నిలదీశారు. మళ్లీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా అని విమర్శించారు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారని, రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని ఎందుకు ఇన్నాళ్లు అడగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోదా రాదని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినా, వైయస్ జగన్ కి ఓటు వేసినా, పవన్ కళ్యాణ్ కి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాజ్యమేలుతుందని, హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదాపై సంతకం పెడతానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తలెత్తుకునే రాజధాని రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. పోలవరం పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. వైయస్సార్ గుర్తుతో గెలిచారని, గెలిచాక వైయస్సార్ ఆశయాలను మరిచారని, కనీసం వైయస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదని ఆరోపించారు.
వైఎస్ జగన్ పాలనలో అంతా మోసమే అని, అన్ని వర్గాలకు మోసమే అన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదని, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ఐదేళ్లలో పూర్తిగా మధ్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చారని, ఐదేళ్ల తర్వాత మధ్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడని, ఇప్పుడు ఉందా మద్యపాన నిషేధమని ప్రశ్నించారు. పదేళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని అన్నారు. ఈ పదేళ్లలో పార్టీలు కనీసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని అన్నారు. ఇక ఈ రోడ్ షోలో వైయస్ షర్మిల తో పాటు సీనియర్లు కేవీపీ, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, కొప్పల రాజు వంటి వారు పాల్గొన్నారు. ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన స్థితిలో ఉన్న కాంగ్రెస్ కు పునర్జీవం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు వైయస్ షర్మిల.
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
This website uses cookies.