
Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త...రైతుబంధు నిధులు విడుదల...!
Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇక ఈ 6 హామీలలో ఇప్పటికే 5 హామీలను పూర్తి చేసినట్లుగా వారు తెలియజేస్తున్నారు. ఇక వీటిలో మహాలక్ష్మి యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే 500 కి గ్యాస్ సిలిండర్ ,అదేవిధంగా గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ,ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీమా సౌకర్యం ఆరోగ్య శ్రీ యోజన కింద 10 లక్షలు ఇస్తున్నారు.
అయితే గత ప్రభుత్వం రైతన్నలకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 10,000 రూపాయలను ఏడాదికి రెండు విడతల్లో ఖాతాలలో జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి.ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు కూడా రైతుబంధు ఇచ్చేశారు. అయితే 3 నుంచి 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి.దీంతో రైతన్నలు మాకు డబ్బు జమ చేయాల్సిందిగా అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 4 ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో 93 శాతానికి పైగా రైతులకు కచ్చితంగా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా రైతు సోదరులకు నగదు విడుదల చేస్తూవస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలయితే కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడం కష్టమే కానీ ఉన్న ప్రాజెక్టులు మాత్రం కచ్చితంగా అమలు చేస్తారని తెలుస్తోంది.
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
This website uses cookies.