
Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త...రైతుబంధు నిధులు విడుదల...!
Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇక ఈ 6 హామీలలో ఇప్పటికే 5 హామీలను పూర్తి చేసినట్లుగా వారు తెలియజేస్తున్నారు. ఇక వీటిలో మహాలక్ష్మి యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే 500 కి గ్యాస్ సిలిండర్ ,అదేవిధంగా గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ,ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీమా సౌకర్యం ఆరోగ్య శ్రీ యోజన కింద 10 లక్షలు ఇస్తున్నారు.
అయితే గత ప్రభుత్వం రైతన్నలకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 10,000 రూపాయలను ఏడాదికి రెండు విడతల్లో ఖాతాలలో జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి.ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు కూడా రైతుబంధు ఇచ్చేశారు. అయితే 3 నుంచి 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి.దీంతో రైతన్నలు మాకు డబ్బు జమ చేయాల్సిందిగా అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 4 ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో 93 శాతానికి పైగా రైతులకు కచ్చితంగా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా రైతు సోదరులకు నగదు విడుదల చేస్తూవస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలయితే కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడం కష్టమే కానీ ఉన్న ప్రాజెక్టులు మాత్రం కచ్చితంగా అమలు చేస్తారని తెలుస్తోంది.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.