Indiramma Houses : భారీ శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం .. 15లోగా వారందరికి ఇందిరమ్మ ఇళ్లు ..!
ప్రధానాంశాలు:
Indiramma Houses : భారీ శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం .. 15లోగా వారందరికి ఇందిరమ్మ ఇళ్లు ..!
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇల్లు కోల్పోయిన పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తామని గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీలోగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టర్తో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి, భూదాన్ భూముల్లో జరిగిన కూల్చివేతలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం పేదల పక్షాన నిలబడి వారికి గౌరవప్రదమైన నివాస వసతి కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.
Indiramma Houses : భారీ శుభవార్త ప్రకటించిన ప్రభుత్వం .. 15లోగా వారందరికి ఇందిరమ్మ ఇళ్లు ..!
Indiramma Houses : అర్హుల గుర్తింపు, ఉచిత స్థలాలు .. పూర్తి సహాయం
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలను గుర్తించేందుకు సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తున్నారు. నిజమైన లబ్దిదారులను గుర్తించి, వారికి ఉచితంగా ఇంటి స్థలం మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. వెలుగుమట్ల ప్రాంతంలో నివాసయోగ్యమైన స్థలాలను కేటాయించి, అక్కడ మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, కాల్వలు వంటి ప్రాథమిక సదుపాయాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందని ఆయన అన్నారు. భూదాన్ భూముల్లో గత ఎనిమిదేళ్లుగా సుమారు 720 కుటుంబాలు నివసిస్తున్నట్లు సర్వేలో వెల్లడైందని తెలిపారు. అందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
Indiramma Houses : ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం
ఇళ్ల కూల్చివేతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మంత్రి అభిప్రాయపడ్డారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. భూదాన్ భూముల పరిరక్షణతో పాటు పేదల పునరావాసం కూడా ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. పేదల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వంగా ప్రతి నిర్ణయం వారి ప్రయోజనాల కోసమే తీసుకుంటున్నామని తెలిపారు. ఇల్లు కోల్పోయిన ఒక్క కుటుంబానికైనా నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వారికి భద్రమైన నివాస స్థలం కేటాయించడం ప్రభుత్వం లక్ష్యమని అన్నారు.
Indiramma Houses : ఉగాది రోజున ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ఇక హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పేదలకు ఉగాది సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి అక్కడే ఇళ్లు నిర్మించుకునేలా సహాయం అందించనున్నారు. స్థలం లేని వారికి భవన సముదాయాలు నిర్మించి ఇళ్లు కేటాయించనున్నారు. ఇందుకు అవసరమైన స్థలాల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పూర్తయింది. త్వరలో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఖమ్మం భూదాన్ భూముల అంశంలో ప్రభుత్వం ఒకవైపు చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు పేదలకు పునరావాసం కల్పించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈ నెల 15వ తేదీ కీలకంగా మారనుండగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుతో సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.