
Urea shortage telangana
Urea Shortage : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా కోసం రైతులు రోజూ అష్టకష్టాలు పడుతుండగా, ప్రభుత్వం మాత్రం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో చోటుచేసుకున్న సంఘటన ఈ నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలిచింది.
Urea shortage telangana
మరిపెడ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. అధికారులు యూరియా ఇచ్చే ముందు రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకున్నారు. అయితే వాటిని గౌరవంగా భద్రపరచకుండా, చిత్తు కాగితాల్లా బయటకు పడేశారు. దీనిని చూసిన రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ ఆధార్, పాస్బుక్ ప్రతులను ఏరుకునే పనిలో పడిపోయి, యూరియా కోసం నిలిచిన లైన్ను వదిలి అసహాయంగా తిరిగారు.
రైతుల పట్ల అధికారుల ఈ నిర్లక్ష్య ధోరణిపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అన్నదాతలను గౌరవించాల్సిన పరిస్థితిలో వారిని అవమానించడం దారుణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
This website uses cookies.