Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2025,3:06 pm

ప్రధానాంశాలు:

  •  Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు

Kavitha  : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో భిన్నతలకు నిదర్శనంగా నిలిచాయి. “మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటీ? నీకు నొప్పి ఏందిరా బాయ్?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీలో కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇంటి ఆడబిడ్డపై విమర్శలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో పనిచేస్తున్న వారే తనపై ప్రతాపం చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమెను “రేవంత్ రెడ్డి కోవర్ట్”గా అభివర్ణించడం అనుచితమని పేర్కొంటూ, తాను అసలే మంచిదాన్ని కాదని, నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు…

నేను లేఖ నీకు నొప్పి ఏందిరా బాయ్ కవిత పరోక్ష వ్యాఖ్యలు

Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు

Kavitha : నేను ఎప్పటికి బిఆర్ఎస్ లోనే.. నా నాయకుడు ఎప్పటికి కేసీఆరే – కవిత

కవిత బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, పెయిడ్ ఆర్టిస్టులు, యూట్యూబ్ ఛానళ్లతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాను జైలు లోపల ఉన్నప్పుడే బీజేపీతో బీఆర్ఎస్ కలవకూడదని కేసీఆర్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. తాను పదవికి రాజీనామా చేయదలచుకున్నప్పటికీ, కేసీఆర్ ఆపడంతోనే కొనసాగుతున్నానని తెలిపారు. బీజేపీ నేతల ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యేది ఎవరో అందరికీ తెలుసునని చెప్పి, పరోక్షంగా పార్టీ నేతలే తనను అర్థం చేసుకోలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, నిజామాబాద్ ఎంపీగా తన ఓటమికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని ఘాటుగా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, కేంద్రం మాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గోదావరి జలాల పంపకం సరిగ్గా జరగకపోవడాన్ని కండించి, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులు వచ్చినా పార్టీ ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండిస్తూ, తన పార్టీ బీఆర్ఎస్, తన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారిని గౌరవిస్తానని చెప్పినా, వారి నాయకత్వాన్ని మాత్రం మన్నించలేనని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలన్నింటితో పార్టీ లోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది