
KCR
KCR : తెలంగాణలో బీజేపీ జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు లేనంత జోష్ బీజేపీ క్యాడర్ లో కనిపిస్తుంది. కొత్త అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేప్పటినప్పటి నుండి కూడా బీజేపీలో జోరు కనిపిస్తూ ఉంది. మరో వైపు కేసీఆర్ కూడా ఏమాత్రం తగ్గకుండా బీజేపీకి మరింత ధీటుగా పార్టీని నిర్మించుకుంటూ ప్రజల్లోకి తీసుకు వెళ్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుని మరీ సమకూర్చుతూ ఉన్నాడు. అయినా కూడా సీఎం కేసీఆర్ లో ఎక్కడో ఆందోళన వ్యక్తం అవుతుందట. ఇప్పుడు సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్న అంశం కొంత మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గ ప్రజలకు దూరంగా ఉండటం. ఎవరైతే నియోజక వర్గంకు దూరంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారో వారి స్థానంలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తోందట.
KCR
బీజేపీ కొత్త ఎత్తుగడను తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఆ విషయమై క్లాస్ పీకారనే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ కు చెందిన దాదాపు పాతిక మంది ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో ఎక్కువగా ఉండకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తమ నియోజక వర్గ సమస్యలు తీసుకు రాకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారట. వారిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీటింగ్ పెట్టి మరీ వారిని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీటు ఉండేది లేనిది చెప్పలేమంటూ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారని కూడా అంటున్నారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా ఇప్పటి నుండే ఎందుకు లే అని కొందరు ఎమ్మెల్యేలు నియోజక వర్గం మొహం చూడటం లేదని కేసీఆర్ దృష్టికి వచ్చిందట. వారందరికి కూడా క్లీయర్ గా కేసీఆర్ చెప్పిన విషయం ఏంటీ అంటే వారంలో కనీసం రెండు మూడు రోజులు అయినా నియోజక వర్గంలో పర్యటించాలి. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు పరిష్కరించి ప్రజల్లో ఉంటున్నట్లుగా జనాలకు తెలిసేలా మీడియాలో ఉండాలి అంటూ కేసీఆర్ సూచనలు చేశాడట. కాస్త సందు ఇస్తే కచ్చితంగా దూరి పోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే కేసీఆర్ ఇలా ముందస్తు జాగ్రత్తలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ చాప కింద నీరు మాదిరిగా విస్తరించుకుండానే పసిగట్టాలని కేసీఆర్ రాజకీయ చతురతతో ఆలోచిస్తున్నారు.
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…
Karthika Deepam 2 April 11th 2026 Today Episode : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న…
Onion Majjiga Pulusu Recipe : ఉల్లిపాయ మజ్జిగ పులుసు ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వంటకం. ముఖ్యంగా…
Watermelon Seeds : వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ వేడిని తట్టుకోవడంలో సహజసిద్ధమైన ఆహారాలు ముఖ్య పాత్ర…
Wealth Temples : జీవితంలో సంపద, స్థిరత్వం ప్రతి ఒక్కరి కల. కానీ ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, అప్పులు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
Tamilnadu Election 2026 : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో అధికారాన్ని…
This website uses cookies.