
KCR vs Kadiyam : కేసీఆర్ వర్సెస్ కడియం.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం..!
KCR vs Kadiyam : ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంత ఇంట్రెస్టింగ్ గా ఈ ఎన్నికలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ సారి మాత్రం మూడు పార్టీల నడుమ పోటీ ఉండబోతోందని తెలుస్తోంది. అందుకే ఈ ఎన్నికలు మూడు పార్టీల భవిష్యత్ ను తెలంగాణలో డిసైడ్ చేయబోతున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిన వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా ఉన్నారు. కడియం కూతురు కావ్యకు కేసీఆర్ వరంగల్ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన పార్టీ మారిపోయారు.
దాంతో ఇప్పుడు కేసీఆర్ ఆయన మీద కోపంగా ఉన్నారు. ఇప్పటి వరకు కడియం పార్టీ మార్పుపై కేసీఆర్ ఎన్నడూ మాట్లాడలేదు. అయితే తాజాగా కడియం శ్రీహరిపై కేసీఆర్ స్పందించారు. తాజాగా ఆయన వరంగల్ లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం మీద ఫైర్ అయ్యారు. ఇక్కడ నేను కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇచ్చాను. కడియంకు నేనేం తక్కువ చేయలేదు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాను. ఎమ్మెల్సీ పదవి ఇచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్యేను చేశాను. అయినా సరే నన్ను మోసం చేసి వెళ్లిపోయాడు. ఆయన చేసిన మోసానికి ఆయన రాజకీయ భవిష్యత్ కు ఆయనే సమాధి కట్టుకున్నాడు. మూడు నెలల్లోపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
KCR vs Kadiyam : కేసీఆర్ వర్సెస్ కడియం.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం..!
ఆ ఎన్నికల్లో రాజయ్యను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటా అంటూ ప్రకటించారు సీఎం కేసీఆర్. కడియంకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై అటు కడియం కూడా స్పందించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మీద నాకు గౌరవం ఉంది. పార్టీ నిర్మాణం చేయాలని ఎన్నోసార్లు సూచించాను.కానీ ఆయన వినలేదు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ నేతలతో అంటకాగుతూ కేసీఆర్ ను నేను మోసం చేయలేకపోయాను. అందుకే నేరుగా పార్టీ మారిపోయాను. అంతే తప్ప కేసీఆర్ ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు లేదు అంటూ తెలిపారు కడియం. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్అవుతున్నాయి.
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
This website uses cookies.